MLC Kavitha : విప్లవాల జిల్లా ఖమ్మంలో కామ్రేడ్స్ మౌనం వహిస్తున్నారు
- ఖమ్మం పర్యటనలో ఎమ్మెల్సీ కవిత పర్యటన
- స్థానిక నేతలతో సన్నిహిత భేటీ
- రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది : కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెండు రోజుల పర్యటనను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం చేరుకున్న కవితకు బీఆర్ఎస్ నాయకుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వడ్డిరాజు రవిచంద్ర నివాసాన్ని కవిత సందర్శించగా, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం.. ఇటీవల స్వల్ప అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్జెసీ కృష్ణను పరామర్శించారు కవిత.
ఖమ్మంలో గాయత్రి రవి నివాసంలో కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడుమంది మంత్రులు ఉన్నా ఖమ్మం జిల్లాకు ఎలాంటి ప్రయోజనం కలుగడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి రైతుల సమస్యలపై స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. “అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కనీస నష్టపరిహారం ఇవ్వని ప్రభుత్వం, సిస్టర్ పొంగులేటి సీతక్కదె నిన్న ములుగు పర్యటనలో ఉన్నా, వైద్యం అందక చనిపోయిన శిశువు విషయంలో స్పందించలేదు” అని ఆరోపించారు.
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
ఖమ్మం జిల్లా విప్లవాలకు నిలయమైనా, ప్రస్తుతం కమ్యూనిస్టులు మౌనం వహిస్తున్నారని విమర్శించారు. ఇప్పటిదాకా అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే కమ్యూనిస్టులు, ఇప్పుడు ప్రభుత్వ భాగస్వాములుగా ఉండటంతో ప్రశ్నించడంలేదు అని కవిత వ్యాఖ్యానించారు.
“జపాన్ మనకంటే పెద్ద దేశమే కావచ్చు కానీ… అక్కడ ఇంటర్నెట్ లేదనుకునేంత స్థితిలో సీఎం ఉన్నారని అర్థమవుతోంది. రైతులు నష్టపోయినా, రాష్ట్రంలో అవ్యవస్థలు ఏర్పడినా ఆయన స్పందించడంలేదు” అని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీటిని అందించామని గుర్తు చేశారు. “ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు గడిచినా ఒక్క ప్రాజెక్టును ప్రారంభించలేకపోయింది” అని విమర్శించారు. అంతేకాకుండా, రైతులకు రుణ మాఫీ, కూలీలకు ఆత్మీయ భరోసా వంటి వాగ్దానాలు కూడా నిలబడలేదని పేర్కొన్నారు. వచ్చే 27వ తేదీన వరంగల్లో జరిగే బీఆర్ఎస్ 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Virat Kohli: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. అత్యధిక హాఫ్ సెంచరీలు..
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!