MLC Kavitha : విప్లవాల జిల్లా ఖమ్మంలో కామ్రేడ్స్ మౌనం వహిస్తున్నారు
- ఖమ్మం పర్యటనలో ఎమ్మెల్సీ కవిత పర్యటన
- స్థానిక నేతలతో సన్నిహిత భేటీ
- రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది : కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెండు రోజుల పర్యటనను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం చేరుకున్న కవితకు బీఆర్ఎస్ నాయకుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వడ్డిరాజు రవిచంద్ర నివాసాన్ని కవిత సందర్శించగా, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం.. ఇటీవల స్వల్ప అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్జెసీ కృష్ణను పరామర్శించారు కవిత.
ఖమ్మంలో గాయత్రి రవి నివాసంలో కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడుమంది మంత్రులు ఉన్నా ఖమ్మం జిల్లాకు ఎలాంటి ప్రయోజనం కలుగడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి రైతుల సమస్యలపై స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. “అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కనీస నష్టపరిహారం ఇవ్వని ప్రభుత్వం, సిస్టర్ పొంగులేటి సీతక్కదె నిన్న ములుగు పర్యటనలో ఉన్నా, వైద్యం అందక చనిపోయిన శిశువు విషయంలో స్పందించలేదు” అని ఆరోపించారు.
Also Read
- Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
- YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
- Google Pixel 11 Series: భారత్లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ గ్రాండ్ లాంచ్.. ధరలు, ఫీచర్ల పూర్తి వివరాలు..
- Astrology: ఆగస్టు 13 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధనలాభం..!
ఖమ్మం జిల్లా విప్లవాలకు నిలయమైనా, ప్రస్తుతం కమ్యూనిస్టులు మౌనం వహిస్తున్నారని విమర్శించారు. ఇప్పటిదాకా అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే కమ్యూనిస్టులు, ఇప్పుడు ప్రభుత్వ భాగస్వాములుగా ఉండటంతో ప్రశ్నించడంలేదు అని కవిత వ్యాఖ్యానించారు.
“జపాన్ మనకంటే పెద్ద దేశమే కావచ్చు కానీ… అక్కడ ఇంటర్నెట్ లేదనుకునేంత స్థితిలో సీఎం ఉన్నారని అర్థమవుతోంది. రైతులు నష్టపోయినా, రాష్ట్రంలో అవ్యవస్థలు ఏర్పడినా ఆయన స్పందించడంలేదు” అని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీటిని అందించామని గుర్తు చేశారు. “ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు గడిచినా ఒక్క ప్రాజెక్టును ప్రారంభించలేకపోయింది” అని విమర్శించారు. అంతేకాకుండా, రైతులకు రుణ మాఫీ, కూలీలకు ఆత్మీయ భరోసా వంటి వాగ్దానాలు కూడా నిలబడలేదని పేర్కొన్నారు. వచ్చే 27వ తేదీన వరంగల్లో జరిగే బీఆర్ఎస్ 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Virat Kohli: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. అత్యధిక హాఫ్ సెంచరీలు..
తాజావార్తలు
-
Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
-
Mr Perfect Copyright Case: దిల్రాజుకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ కేసులో కీలక పరిణామం!
-
YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
-
Google Pixel 11 Series: భారత్లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ గ్రాండ్ లాంచ్.. ధరలు, ఫీచర్ల పూర్తి వివరాలు..
-
Irumbudi Trailer: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ .. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్న మేకర్స్
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..