Kalti Kallu: మహబూబ్నగర్ జిల్లాలో కల్తీ కల్లు కలకలం.. పెరుగుతోన్న బాధితుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalti Kallu: మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు బాధితులు, మృతుల సంఖ్య పెరుగుతుండటం కలకలం రేపుతోంది. జిల్లా ఆస్పత్రికి కల్తీ కల్లు బాధితులు క్యూ కడుతూనే ఉన్నారు. సుమారు ఆరు రోజులుగా బాధితులకు చికిత్స కొనసాగుతూనే ఉంది. 40 మందికిపైగా బాధితులు ఆస్పత్రిలో చేరగా… వారిలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. చనిపోయినవారిలో కోడూరుకు చెందిన అంజయ్య, అంబేద్కర్నగర్కు చెందిన విష్ణుతోపాటు మరొకరు ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే, మృతుల, బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు ఆసుపత్రి సిబ్బంది. మృతుల కుటుంబాలతో కల్లు కాంపౌండ్ నిర్వాహకులు బేరసారాలు చేస్తున్నారు. బాధితుల వివరాలు వెల్లడించొద్దని ఆసుపత్రి సిబ్బందిపై ఎక్సైజ్ శాఖాధికారులు ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. దీంతో కల్తీ కల్లు వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: Balineni Srinivasa Reddy: మళ్లీ అలిగిన బాలినేని… సీఎం జగన్ బుజ్జగింపులు
Also Read
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
- OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న 'ఓలా ఎలక్ట్రిక్'..
- UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
కల్తీకల్లు వ్యవహారంపై మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పందించారు. కల్లు శాంపిల్స్ను FCLకు పంపించామని, ఆ రిపోర్ట్ వచ్చే వరకు అది కల్తీకల్లు అని చెప్పలేమని ఆయనన్నారు. FCL రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. కల్తీ కల్లు మరణాలకు మంత్రి శ్రీనివాస్గౌడ్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ. కల్తీకల్లు వ్యవహారమంతా శ్రీనివాస్గౌడ్ కనుసన్నల్లోనే నడుస్తోందని ఆమె ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లాలో కల్తీ కల్లు ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారినా కానీ.. దీనిపై ఎక్సైజ్ అధికారులు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంతో పలు అనుమాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Peddi Censor Review : ‘రంగస్థలం’ను మించిన యాక్టింగ్…. లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
-
Acer Aspire 5 AI Laptop: 32GB ర్యామ్, 14-అంగుళాల డిస్ప్లేతో.. ఏసర్ కొత్త ఆస్పైర్ 5 ల్యాప్టాప్ విడుదల
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
-
Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!