Kadiyam Kavya : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఫార్మసీ విభాగాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కడియం కావ్య
- వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కడియం కావ్య ఆకస్మిక తనిఖీ
- నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫార్మసీ సిబ్బందిపై ఎంపీ ఆగ్రహం
- విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఫార్మసీ విభాగాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ గార్లతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు MGM ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఓ రోగి బంధువు తనకు మందులు ఇవ్వడం లేదన్న విషయాన్ని మంత్రులు, ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య రోగిని తీసుకుని నేరుగా ఎంజీఎం ఆస్పత్రిలోని ఫార్మసీ కేంద్రానికి చెరుకుని పేషెంట్లకు ఇస్తున్న మందులను పరిశీలించారు. మందుల స్టాక్ వివరాలను రిజిస్టర్ ను పరిశీలించారు. ఎన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయో ఎంపీ స్వయంగా పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందుల వివరాలను సేకరించారు. స్వతహాగా డాక్టర్ అవ్వడం వలన క్షుణంగా మెడిసిన్స్ గురించి, సీడిఎస్ నుండి రావలసిన మందుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Samantha: హాస్పిటల్ బెడ్పై సమంత.. అందుకే అంటూ పోస్ట్
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
- CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
దాదాపు మూడు నెలలుగా మెడిసిన్స్ అందుబాటులో లేకపోయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫార్మసీ సిబ్బందిపై ఎంపి డాక్టర్ కడియం కావ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు పెద్దదిక్కుగా ఉన్న MGM ఆసుపత్రిలో కనీసం పెయిన్ కిల్లర్స్ కూడా అందుబాటులో లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. మందులు అందుబాటులో లేవు అంటూ బయటకు రాయడం సరికాదని, మరోసారి ఇలాంటి తప్పులు పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం విషయాన్ని ఎంపీ డా. కడియం కావ్య మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లారు. ఎంపీ డా.కడియం కావ్య గారు అందించిన వివరాలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వైద్య అధికారులను మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలని అన్నారు. ముఖ్యంగా పేద ప్రజలకు అందాల్సిన విద్యా, వైద్యం లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Andhra Pradesh: పీజీ వైద్య విద్యలో ఇన్సర్వీస్ రిజర్వేషన్పై రేపు చర్చలు
తాజావార్తలు
-
TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
-
Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
-
Peddi : ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!**
-
CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?