NTV Telugu Site icon

KA Paul: పవన్‌కు ‘పుట్టింటోళ్లు తరిమేశారు.. కట్టుకున్నోడు వదిలేశాడు’ పరిస్థితి..!

Ka Paul

Ka Paul

KA Paul: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై హాట్‌ కామెంట్లు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత ‘పుట్టింటోళ్లు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు’ అనే పరిస్థితి పవన్‌ కల్యాణ్‌కు వస్తుందంటూ జోస్యం చెప్పారు.. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన 14 సంవత్సరాల పరిపాలనలో చాలా అవినీతి చేశాడని ఆరోపించారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. అందుకే మేం గెలుస్తాం అని చెప్పుకొచ్చారు. మీకు ఎలాగు పరిపాలన చేతకాలేదు, నాకు ఛాన్స్ ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాను అని వ్యాఖ్యానించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. గతంలో.. పవన్‌పై విమర్శలు చేసిన పాల్.. ఈ సారి.. జయమాలిని అప్పట్లో డాన్స్ చేసి మెప్పించిన ‘పుట్టింటోళ్లు తరిమేశారు.. కట్టుకున్నాడు వదిలేశాడు..’ పాట గుర్తు చేస్తూ.. పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు.

Read Also: Pakistan : పాకిస్థాన్ లో మోస్ట్ పాపులర్ కార్లు..ఎక్కువగా కొనేవి ఏంటో తెలుసా ?

కాగా, ఈ మధ్య పవన్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విరుచుకుపడిన విషయం విదితమే.. పవన్ కల్యాణ్‌కి తెలంగాణలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేసిన ఆయన.. తెలంగాణ ప్రజలు పవన్‌ కల్యాణ్‌ను తరిమి తరిమి కొట్టారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు, విశాఖపట్నం వచ్చి పవన్ కల్యాణ్‌ మాట్లాడుతున్నారని.. ఇక్కడ నుంచి కూడా వెళ్లిపోవాలి.. నువ్వు ప్యాకేజీ స్టార్‌వి.. ఆయన పార్టీ అవినీతి పార్టీ అంటూ కేఏ పాల్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విదితమే. అయితే, ఈ రోజు విశాఖపట్నంలోని అసిల్మెట్టలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న కేఏ పాల్.. నిరుపేదలకు, చిన్నారులకు చీరలు, బ్లాక్‌కెట్స్, ఫుడ్‌ పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా పవన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.