KA Paul: చంద్రబాబు అరెస్ట్పై ఇలా స్పందించిన కేఏ పాల్.. ఏంటి? మీ మ్యాచ్ ఫిక్సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడంపై స్పందించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు దోచుకున్నాడని జగన్.. వైఎస్ జగన్ దోచుకున్నాడని చంద్రబాబు.. ఏంటి? మీ మ్యాచ్ ఫిక్సింగ్ అని నిలదీశారు. నరేంద్ర మోడీ, అమిత్షా, అదానీల తొత్తులా మీరు? అని ఫైర్ అయ్యారు. చంద్రబాబు అవినీతికి పాల్పడాడు గనుకే అరెస్టు అయ్యారని వ్యాఖ్యానించారు. బాబు రావాలను అంటున్నారు.. ప్రత్యేక హోదా తేలేకపోయారు.. కియా తప్పా మరే కంపెనీ తేలేకపోయారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు అంబేద్కర్, మహాత్మా గాంధీ అంటా.. లోకేష్ భగత్ సింగ్ అట అంటూ ఎద్దేవా చేశారు. దోచుకున్నవాళ్లు దేశనాయకులంట.. చాలా దారుణం అంటూ విరుచుకుపడ్డారు పాల్..
ఇక, బాయ్ బాయ్ మోడీ, బాయ్ బాయ్ బాబు.. బాయ్ బాయ్ జగన్ అంటూ హాట్ కామెంట్లు చేశారు ప్రజాశాంతి పార్టీ అధినేత.. గతంలో ఫార్మా కంపెనీలకు కాలుష్యంపై ఓ హెచ్చరిక జారీచేశాను.. విజయనగరం ప్రజలకు సాయం అందించడంలేదని చెప్పాను.. కెమికల్స్ ద్వారా గాలి, నీరు కాలుషితంగా తయ్యారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పొలిటికల్ కరెప్సన్ బాగా పెరిగిపోయింది.. పద్దెనిమిది కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.. కానీ, లాభంలో పదో అయిదు శాతం ప్రజల కోసం ఖర్చు చేయాలన్న ఆలోచన లేదన్నారు. కనీసం 5 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వ లేరా..? అని నిలదీశారు. నేను పోరాటం చేస్తే అన్నీ భూస్థాపితమైపోతాయి.. అందుకే ప్రజాశాంతి పార్టీ పెట్టాను అని చెప్పుకొచ్చారు.
Also Read
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
42 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా, కరోనా సమయంలో నిరాహారదీక్ష చేపట్టి పదోతరగతి పరీక్షలు ఆపాను అని చెప్పుకొచ్చారు కేఏ పాల్.. ఇక, ఫ్యామిలీ రూల్ ని ఆపుదాం అందరూ ముందుకు రండి అని పిలుపునిచ్చారు. బీసీ బానిసలారా, ఎస్సీ, ఎస్టీ బానిసలారా..? ముందుకు రండి.. బడుగు బలహీన వర్గాల ప్రజలు.. ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నాయి.. మీరూ ముందుకు రండి అని పిలుపునిచ్చారు పాల్.. ఇక, స్టీల్ ప్లాంట్ కోసం ఎవరైనా ప్రజా ప్రతినిధులు తమ పదవికి రాజీనామా చేశారా..? అని ప్రశ్నించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్..
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!