KA Paul: నిరవధిక నిరాహార దీక్షకు దిన కేఏ పాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul: వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్పరం కాకుండా.. తన ప్రాణాలను సైతం విడిచేందుకు సిద్ధం అంటున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. స్టీల్ ప్లాంట్ ను అమ్మబోమని కేంద్రం అధికార ప్రకటన చేయాలంటూ ముందుగానే డెడ్లైన్ విధించారు పాల్.. స్టీల్ ప్లాంట్ విషయంలో వెనక్కి తగ్గకపోతే సోమవారం నుంచి ఆమరణనిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా ఈరోజు నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు కేఏ పాల్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనే డిమాండ్తో పాల్ కన్వెన్షన్ సెంటర్లో దీక్షను మొదలుపెట్టారు.. ఇక, రానున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ విశాఖ నుంచి పోటీ చేస్తుందని ప్రకటించిన ఆయన.. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు పేర్కొన్నారు.. ప్రజాశాంతి పార్టీతో మిగిలిన రాజకీయ పార్టీలు కలిసి వస్తే.. ఉక్కు పరిశ్రమను కాపాడటం పెద్ద కష్టం కాదంటున్నారు కేఏ పాల్. ఇక, ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో.. ‘ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు, విశాఖపట్నం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కేఏ పాల్ ఆమరణ నిరాహారదీక్ష” అంటూ రాసుకొచ్చారు.
Read Also: Food Poison: మహారాష్ట్రలో 160 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రిలో చికిత్స
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
మరోవైపు.. కేంద్రం మన రాష్ట్రానికి ఏమీచేయకుండా మొండి చేయి చూపించిందని ఇప్పటికే ఆరోపించారు పాల్.. మనం కట్టిన పన్నులను గుజారత్ కు తరలిస్తున్నారు.. ఒక్క స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటే మన రాష్ట్రానికి ఉన్న అప్పులన్నీ తీరిపోతాయన్నారు. నాకు అనుమతిస్తే 4000 కోట్ల రూపాయలు నేను సమకూర్చుతానని ప్రకటించిన విషయం విదితమే.. ఇక, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. నరేంద్ర మోడీతో కలిసి వెళ్తానంటున్నారు.. పవన్ ఎవరు ప్యాకేజిస్తే వాళ్లతో వెళ్తున్నారంటూ అనేకమంది విమర్శలు చేస్తున్నారు. కానీ, పవన్ నాతో చేయి కలిపితే నేను గెలిపిస్తానని పాల్ పేర్కొన్న విషయం విదితమే.. నన్ను ఎంపీగా గెలిపిస్తే గంగవరం పోర్టును సీజ్ చేస్తాను అంటూ సంచలన ప్రకటన చేసిన ఆయన.. అదానీపరం కాకుండా ఆపి తెలుగుసత్తా చూపిస్తాను.. ప్రాణం పెట్టడానికి వచ్చాను.. ప్రాణం పోయేలోపు తెలుగువారి సత్తా చూపిస్తాను అంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వెల్లడించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!