Kaleshwaram: నేడు రాష్ట్రానికి జస్టిస్ పీసీ ఘోష్.. రేపు మేడిగడ్డలో ఉత్తమ్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram: జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేడు హైదరాబాద్ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న ఆయన నేడు నగరానికి రానున్నారు. 7, 8 తేదీల్లో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలిస్తారు. బ్యారేజీల మరమ్మతు, పునరుద్ధరణ పనులను ఈ నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే బ్యారేజీలను నిపుణుల కమిటీ కూడా పరిశీలించింది. పనులు ఎంతవరకు జరిగాయో తెలుసుకునేందుకు పీసీ ఘోష్ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.
మరోవైపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కడెం ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రేపు (శుక్రవారం) పరిశీలించనున్నారు. కడెం ప్రాజెక్టు మరమ్మతులకు ప్రభుత్వం రూ.3.81 కోట్లు కేటాయించగా, ఆ నిధులతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మంత్రి ఉత్తమ్ పనులను పరిశీలించి తగు సూచనలు చేయనున్నారు. ఆ తర్వాత సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను కూడా పరిశీలిస్తారు.
Also Read
- Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
- Balloon Gas Cylinder Blast : మియాపూర్లో బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలుడు.. నలుగురికి గాయాలు
- Bhatti Vikramarka : తెలంగాణపై భట్టి ఫోకస్.. రూ.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్.!
- Smart Ration Cards : గుడ్న్యూస్.. తెలంగాణలో ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు
Read also: Raashii Khanna: తడి అందాలతో టెంప్ట్ చేస్తున్న రాశి ఖన్నా
కాగా, మేడిగడ్డ బ్యారేజీలోని 16, 17వ నంబర్ గేట్లను బలవంతంగా ఎత్తివేసే ప్రక్రియను ఇవాళ చేపట్టనున్నారు. ఈ మేరకు ఈఎన్సీ (జనరల్) గుమ్మడి అనిల్ కుమార్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) ఓరుగంటి మోహన్ కుమార్తో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. రేపు (శుక్రవారం) మంత్రి ఉత్తమ్, న్యాయమూర్తి పీసీ ఘోష్ వస్తున్నందున అక్కడే ఉండి ఏర్పాట్లు చేయనున్నారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు 54 ఫిర్యాదులు అందాయి.
కమిషన్ తరపున మే 31లోగా కమిషన్ కార్యాలయానికి నోటరీ ద్వారా అఫిడవిట్ రూపంలో ఫిర్యాదు చేయాలని నీటిపారుదల శాఖ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. గడువు ముగిసిన తర్వాత వచ్చిన ఫిర్యాదుల సంఖ్యను లెక్కిస్తే 54 అని తేలింది. ఇదిలా ఉండగా బ్యారేజీల నిర్మాణంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన అధికారులు, ఇంజినీర్లు, మాజీ ప్రజాప్రతినిధులకు రెండు లేదా మూడో వారంలో కమిషన్ నోటీసులు ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.
Tejashwi Yadav: నితీశ్ కింగ్ మేకరే అయితే బిహార్కు స్పెషల్ స్టేటస్ తేవాలి..!
తాజావార్తలు
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్కే!
-
PM Modi: జేడీ వాన్స్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
-
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!