Shocking Incident: వీడు మామూలోడు కాదు భయ్యా.. ఏకంగా జడ్జినే బెదిరించాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Incident: కొంత మంది రౌడీలు, గుండాలు జడ్జిలను బెదిరించడం సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఒకడు నిజంగానే రియల్ లైఫ్లో డబ్బుల కోసం ఏకంగా జడ్జినే బెదిరించాడు. విషయం బయటికి రాగానే నెటిజన్లు.. వీడు మామూలోడు కాదు భయ్యా.. అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ రౌడీ చాలా తెలివిగా ఓ స్పీడ్ పోస్ట్లో జడ్జిని బెదిరిస్తూ లెటర్ పంపి డబ్బులు డిమాండ్ చేశాడు. వీడి ధైర్యం ఏంటి, ఈ సంఘటన ఎప్పుడు వెలుగు చూసిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Coolie OTT Release:ఓటీటీలోకి రజనీకాంత్ ‘కూలి’.. ఎప్పుడంటే??
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
జడ్జిని రూ.5 బిలియన్లు డిమాండ్ చేశాడు..
మధ్యప్రదేశ్లోని రేవా జిల్లా త్యోతర్ కోర్టులో మోహిని భడోరియా అనే మహిళ మొదటి సివిల్ జడ్జిగా పని చేస్తున్నారు. ఈసందర్భంగా ఆమెకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా ఒక లెటర్ వచ్చింది. ముందుగా ఆమె దానిని చాలా సాధారణమైన లెటర్ అనుకుంది. కానీ దానిని ఓపెన్ చేసి చూస్తే అందులో ఆమెను బెదిరిస్తూ, ప్రాణాలతో ఉండాలంటే రూ.5 బిలియన్ల చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆమెను ఎవరైతే బెదిరింపులకు పాల్పడ్డారో ఆయన తనను బందిపోటు నాయకుడు హనుమంతుడి ముఠా సభ్యుడిగా పేర్కొన్నాడు. ఫస్ట్ ఈ లెటర్ చదివిన తర్వాత జడ్జి మోహిని భయడ్డారు. ఈ లెటర్లో ఆమె ఆ మొత్తం డబ్బులను సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి 7:45 గంటలకు ఉత్తరప్రదేశ్లోని బద్గడ్ అడవికి పంపించాలని డిమాండ్ చేశాడు. ఒక వేళ పంపించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన జడ్జి..
బెదిరింపుతో ఆశ్చర్యపోయిన జడ్జి భడోరియా వెంటనే లెటర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. న్యాయమూర్తికి బెదిరింపునకు పాల్పడటంతో పాటు, రూ.5 బిలియన్ల చెల్లించాలని డిమాండ్ చేస్తూ వచ్చిన రిజిస్టర్డ్ పోస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కేసు విచారణలో భాగంగా ఉత్తరప్రదేశ్కు కూడా ఒక బృందాన్ని పంపించామని చెప్పారు. ఇప్పటికే కేసులో ఒక నిందితుడిని గుర్తించినట్లు చెప్పారు.
READ ALSO: UP Man Wins Lottery: 30 ఏళ్ల యువకుడికి రూ.34 కోట్ల బహుమానం.. దుబాయ్లో యూపీ యువకుడి అదృష్టం..
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!