UP Man Wins Lottery: 30 ఏళ్ల యువకుడికి రూ.34 కోట్ల బహుమానం.. దుబాయ్లో యూపీ యువకుడి అదృష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Man Wins Lottery: పొట్ట చేతిలో పట్టుకొని పరాయి దేశానికి వలస పోయిన ఓ వ్యక్తికి అదృష్టం కలిసి వచ్చింది. ఒక్క రోజులో మనోడు యూఏఈలో కొత్త మిలియనీర్గా అవతరించాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ కొత్త మిలియనీర్ మన దేశానికి చెందిన వ్యక్తే. ఆయనే ఉత్తరప్రదేశ్కు చెందిన సందీప్ కుమార్ ప్రసాద్. ఇంతకీ సందీప్కు అంతలా అదృష్టం ఏలా కలిసి వచ్చిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Vijayawada: విజయవాడ నుంచి బెంగళూరుకు ఫ్లైట్ కు తప్పిన పెను ప్రమాదం.. అసలేమైందంటే…
Also Read
- AP High Court: విశాఖ డేటా సెంటర్పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
15 మిలియన్ దిర్హామ్ల లక్..
ఉత్తరప్రదేశ్కు చెందిన సందీప్ కుమార్ ప్రసాద్ గత మూడు ఏళ్లుగా దుబాయ్లో ఉంటున్నాడు. ఈ 30 ఏళ్ల యువకుడు అక్కడి బిగ్ టికెట్ లాటరీ సిరీస్ 278లో 15 మిలియన్ దిర్హామ్ల (సుమారు రూ. 34 కోట్లు) బహుమతిని గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. బుధవారం రాత్రి జరిగిన డ్రా ఆయన్ని యూఏఈలో కొత్త మిలియనీర్గా మార్చింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆయనకు లాటరీ తగిలిన విషయం తన స్నేహితుల ద్వారానే తెలిసిందని చెప్పాడు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదట్లో తాను క్రమం తప్పకుండా టిక్కెట్లు కొనలేదని అన్నాడు. కానీ గత మూడు నెలలుగా వాటిని కొనుగోలు చేస్తున్నానని చెప్పారు. ఆగస్టు 19న తన లక్కీ టికెట్ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇక్కడ మ్యాజిక్ ఏమిటంటే తాను ఒక్కడినే ఈ టికెట్ కొనుగోలు చేయలేదని, మరో 20 మందితో కలిసి దానిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు ఆయన తన బహుమతిని 20 మందితో పంచుకోవలసి ఉంటుంది. ఇదే జరిగితే మనోడికి రూ.1.70 కోట్లు మాత్రమే వస్తాయి. డ్రా తీసిన సెప్టెంబర్ 3న లైవ్ షో సమయంలో అబుదాబి నుంచి సందీప్కు కాల్ వచ్చినప్పుడు, ఆయన అతను షో కూడా చూడటం లేదని చెప్పాడు. మొదట తన అదృష్టాన్ని తాను నమ్మలేదని, కానీ హోస్ట్ తన విజయాన్ని ధృవీకరించిన వెంటనే, తీవ్రమైన భావోద్వేగానికి గురనట్లు చెప్పారు.
ఆయన ఏం చెప్పారంటే..
తన అదృష్టంపై సందీప్ మాట్లాడుతూ.. హోస్ట్ తన విజయాన్ని ధృవీకరించిన వెంటనే, తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. ‘నా జీవితంలో మొదటిసారిగా చెప్పలేనంత ఆనందం వచ్చింది’ అని అన్నాడు. అతను దుబాయ్ డ్రైడాక్స్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నట్లు చెప్పారు. తాను విదేశాలకు వచ్చిందే కుటుంబ ఆర్థిక పరిస్థితిని మార్చడానికి అని చెప్పారు. తన తండ్రికి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఈ డబ్బులతో ఆయన ఆరోగ్యం బాగు చేయిస్తానని చెప్పారు. ఈ విజయం తన కుటుంబానికి అవసరమైన బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఇప్పుడు తను తన సొంత వ్యాపారం ప్రారంభించాలనే కలతో భారతదేశానికి తిరిగి రావాలనుకుంటున్నట్లు చెప్పాడు.
READ ALSO: Mrunal Thakur : అనుష్క శర్మ పై మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు
తాజావార్తలు
-
OTR: దువ్వాడ శ్రీనివాస్ అడుగులు మళ్లీ వైసీపీ వైపు పడుతున్నాయా..?
-
AP High Court: విశాఖ డేటా సెంటర్పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
-
Nakshathra : లవ్ యూ నాన్న, లవ్ యూ అమ్మ
-
Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. ‘శివ నువ్వు తోపు సామీ’.. స్టేజ్ పైనే డైరెక్టర్ను హత్తుకున్న మాస్ మహారాజా!
-
Mythri Ravi: ఫోన్లో రీల్స్ చూసినా ఏడుపొస్తోంది.. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ ఇప్పుడే..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!