Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్పై ఏపీలో ‘కాయ్ రాజా కాయ్’.. కోడి పందేలకు మించి బెట్టింగ్!
- ట్వంటీ20 మ్యాచ్ను తలపిస్తున్న జూబ్లీహిల్స్ ఫైట్
- జూబ్లీహిల్స్పై ఏపీలో కాయ్ రాజా కాయ్
- బెట్టింగ్ రాయుళ్ల సొంత సర్వేలు
- ఇప్పటి వరకు దాదాపు రూ.6 వందల కోట్ల బెట్టింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇటు తెలంగాణ, అటు ఏపీలో బెట్టింగ్ రాయుళ్లకు పండగలా మారింది. కోట్ల రూపాయల బెట్టింగ్ చేతులు మారుతోంది. హైదరాబాద్లో వుంటున్న బంధువులను వాకబు చేస్తూ మరీ…పందెం కాస్తున్నారు.
జూబ్లీహిల్స్ బైపోల్ రోజురోజుకు ఉత్కంఠ పెంచుతోంది. మారుతున్న సమీకరణలు, విసురుతున్న సవాళ్లు… వేస్తున్న వ్యూహాలతో ఎవరు గెలుస్తారోనన్న సస్సెన్స్ ట్వంటీ20 మ్యాచ్ను తలపిస్తోంది. అన్ప్రిడిక్టబుల్ గా మారిన జూబ్లీహిల్స్ పోరు..సహజంగానే బెట్టింగ్ రాయుళ్లను టెమ్ట్ చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జూబ్లీహిల్స్ ఎన్నికపై కాయ్ రాజా కాయ్ వ్యవహారం కోడి పందేల రేంజ్లో సాగుతోంది.
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
జూబ్లీహిల్స్ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే ఆంధ్రప్రదేశ్లో పందేల జోరు మొదలైంది. చాలామంది సొంతంగా సర్వేలు చేయించుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని ఇతర ఏరియాల్లోని తమ బంధువులకు ఫోన్లు చేసి..ఎవరు గెలస్తారు…ఏ పార్టీకి వాతావరణం అనుకూలంగా వుందంటూ ఆరా తీస్తున్నారు. అయితే, ఒక్కొక్క ఏరియాలో, ఒక్కో ట్రెండ్ వస్తుండటంతో…పలానా పార్టీ గెలుస్తుందన్న అభిప్రాయానికి రాలేకపోతున్నారు. దీంతో ఏ పార్టీ విజయ బావుటా ఎగరేస్తుందంటూ జోరుగా పందేలు కాస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల పందేలు కాసినట్టు తెలుస్తోంది. ఎన్నికల నాటికి ఇది కాస్తా 14 వందల కోట్లకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇటు తెలంగాణలోనూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బెట్టింగ్ పై ఎవరూ తగ్గడం లేదు. పందెం రాయళ్లు ఎంతపడితే అంత డబ్బులు పెట్టేస్తున్నారు. ఒక ఏరియాలోని 10 మంది కలిసి పాతిక కోట్ల బెట్టింగ్ కాశారని ప్రచారం జరుగుతోంది. ఇంకా చాలా చోట్ల కోట్లలో పందేలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. అటు ఏపీ, ఇటు తెలంగాణలో ప్రత్యేక సర్వేలకు 70 వేల నుంచి లక్ష చెల్లిస్తున్నాయి. పెద్ద ఏజెన్సీలకైతే 3 లక్షల దాకా ఇస్తున్నట్టు సమాచారం. పక్కా సమాచారంతో బెట్టింగ్ కాసి…కోట్లు కొల్లగొట్టాలని పందేలకు సై అంటున్నారు. మొత్తానికి ఉత్కంఠగా మారిన జూబ్లీహిల్స్ ఎన్నిక అటు ఏపీ, ఇటు తెలంగాణలో పెద్ద ఎత్తున బెట్టింగ్ మనీ చేతులు మారేలా చేస్తోంది.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!