Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్పై ఏపీలో ‘కాయ్ రాజా కాయ్’.. కోడి పందేలకు మించి బెట్టింగ్!
- ట్వంటీ20 మ్యాచ్ను తలపిస్తున్న జూబ్లీహిల్స్ ఫైట్
- జూబ్లీహిల్స్పై ఏపీలో కాయ్ రాజా కాయ్
- బెట్టింగ్ రాయుళ్ల సొంత సర్వేలు
- ఇప్పటి వరకు దాదాపు రూ.6 వందల కోట్ల బెట్టింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇటు తెలంగాణ, అటు ఏపీలో బెట్టింగ్ రాయుళ్లకు పండగలా మారింది. కోట్ల రూపాయల బెట్టింగ్ చేతులు మారుతోంది. హైదరాబాద్లో వుంటున్న బంధువులను వాకబు చేస్తూ మరీ…పందెం కాస్తున్నారు.
జూబ్లీహిల్స్ బైపోల్ రోజురోజుకు ఉత్కంఠ పెంచుతోంది. మారుతున్న సమీకరణలు, విసురుతున్న సవాళ్లు… వేస్తున్న వ్యూహాలతో ఎవరు గెలుస్తారోనన్న సస్సెన్స్ ట్వంటీ20 మ్యాచ్ను తలపిస్తోంది. అన్ప్రిడిక్టబుల్ గా మారిన జూబ్లీహిల్స్ పోరు..సహజంగానే బెట్టింగ్ రాయుళ్లను టెమ్ట్ చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జూబ్లీహిల్స్ ఎన్నికపై కాయ్ రాజా కాయ్ వ్యవహారం కోడి పందేల రేంజ్లో సాగుతోంది.
Also Read
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
జూబ్లీహిల్స్ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే ఆంధ్రప్రదేశ్లో పందేల జోరు మొదలైంది. చాలామంది సొంతంగా సర్వేలు చేయించుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని ఇతర ఏరియాల్లోని తమ బంధువులకు ఫోన్లు చేసి..ఎవరు గెలస్తారు…ఏ పార్టీకి వాతావరణం అనుకూలంగా వుందంటూ ఆరా తీస్తున్నారు. అయితే, ఒక్కొక్క ఏరియాలో, ఒక్కో ట్రెండ్ వస్తుండటంతో…పలానా పార్టీ గెలుస్తుందన్న అభిప్రాయానికి రాలేకపోతున్నారు. దీంతో ఏ పార్టీ విజయ బావుటా ఎగరేస్తుందంటూ జోరుగా పందేలు కాస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల పందేలు కాసినట్టు తెలుస్తోంది. ఎన్నికల నాటికి ఇది కాస్తా 14 వందల కోట్లకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇటు తెలంగాణలోనూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బెట్టింగ్ పై ఎవరూ తగ్గడం లేదు. పందెం రాయళ్లు ఎంతపడితే అంత డబ్బులు పెట్టేస్తున్నారు. ఒక ఏరియాలోని 10 మంది కలిసి పాతిక కోట్ల బెట్టింగ్ కాశారని ప్రచారం జరుగుతోంది. ఇంకా చాలా చోట్ల కోట్లలో పందేలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. అటు ఏపీ, ఇటు తెలంగాణలో ప్రత్యేక సర్వేలకు 70 వేల నుంచి లక్ష చెల్లిస్తున్నాయి. పెద్ద ఏజెన్సీలకైతే 3 లక్షల దాకా ఇస్తున్నట్టు సమాచారం. పక్కా సమాచారంతో బెట్టింగ్ కాసి…కోట్లు కొల్లగొట్టాలని పందేలకు సై అంటున్నారు. మొత్తానికి ఉత్కంఠగా మారిన జూబ్లీహిల్స్ ఎన్నిక అటు ఏపీ, ఇటు తెలంగాణలో పెద్ద ఎత్తున బెట్టింగ్ మనీ చేతులు మారేలా చేస్తోంది.
తాజావార్తలు
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..