J. P. Nadda: స్వాతి మలివాల్ అంశంలో ఆప్ ఆరోపణలపై జేపీ నడ్డా ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వైపు స్వాతి మలివాల్ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు రాజకీయాలు కూడా జోరందుకున్నాయి. దీని వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి విశ్వసనీయత లేదని అన్నారు. కేజ్రీవాల్ అసలు ముఖం బయటపడిందని జేపీ నడ్డా అన్నారు. ప్రజలను ఇళ్లకు పిలిచి కొడుతున్నారని విమర్శించారు. భాజపాతో స్వాతి మలివాల్ అనే మాటే లేదన్నారు. తాము ఆమెతో (స్వాతి మలివాల్) ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఆప్ ఆరోపణలపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. ‘ఆమ్ ఆద్మీ పార్టీ అబద్ధాల పునాదిపై నిర్మించిన పార్టీ. దాని విశ్వసనీయత సున్నా కాదు.. అది మైనస్లో ఉంది. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజల ముందు, ఢిల్లీ ప్రజల ముందు బట్టబయలయ్యారు. ఈ కుట్ర బీజేపీ పన్నితే బిభవ్ ను (లక్నోలో పీసీ సమయంలో) ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు తరలిస్తున్నారు? మీరు మౌనంగా ఎందుకు వున్నారు? మిమ్మల్ని ఆపేది ఏమిటి?’ అని ప్రశ్నించారు.
READ MORE: Gujarat : వీళ్లు మనుషులు కారు.. కుక్క కాళ్లు పట్టుకుని భవనంపై నుంచి కింద పడేశారు
Also Read
ఢిల్లీ ప్రభుత్వ మంత్రి అతిషి మరోసారి స్వాతి మలివాల్ను టార్గెట్ చేశారు. స్వాతి మలివాల్ విషయంలో కూడా బీజేపీ పాత ఫార్ములానే ఉపయోగిస్తోందని అతిషి అన్నారు. స్వాతి మలివాల్తో ఎవరు మాట్లాడారో తెలుసుకోవడానికి ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని అతిషి డిమాండ్ చేశారు. స్వాతిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. ‘స్వాతి మలివాల్పై యాంటీ కరప్షన్ బ్యూరో రిక్రూట్మెంట్ స్కామ్ కేసు నడుస్తోంది. ఇప్పుడు ఈ కేసు ముగింపు దశకు చేరుకుంటోంది. అందుకే బీజేపీ ఇదే ఫార్ములాలో ఉండొచ్చని తెలుస్తోంది. వివిధ నేతలపై కేసులు పెట్టేందుకు స్వాతి మలివాల్ తో బీజేపీ నేతలు నిరంతరం టచ్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.” అని ఆమె పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!