Jharkhand: హైదరాబాద్కు షిఫ్ట్ అయిన ఝార్ఖండ్ పాలిటిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఝార్ఖండ్ (Jharkhand) సంక్షోభానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎట్టకేలకు చంపయ్ సోరెన్ (Champai Soren) సీఎంగా ప్రమాణం చేశారు. హేమంత్ సోరెన్ (Hemant Soren) అరెస్ట్ తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో తీవ్ర సందిగ్ధం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ను 43 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్లు మద్దతుతో కూడిన లేఖను గవర్నర్ రాధాకృష్ణన్కు అందజేశారు. ప్రమాణస్వీకారానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేసినా కొన్ని గంటల పాటు గవర్నర్ హోల్డ్లో పెట్టారు. దీంతో రాజ్భవన్ వేదికగా ఏదో కుట్ర జరుగుతోందని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి అనుమానించింది. మొత్తానికి గురువారం అర్ధరాత్రి గవర్నర్.. చంపయ్ను ప్రమాణస్వీకారానికి పిలిచారు. ఇక శుక్రవారం ఉదయం చంపయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇదిలా ఉంటే అసెంబ్లీలో బలనిరూపణకు గవర్నర్ 10 రోజులే సమయం విధించారు. దీంతో మరోసారి కూటమిలో భయాందోళన మొదలైంది. ఈ మధ్యలో ఏదైనా జరగొచ్చన్న సందేహంతో జేఎంఎం క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది.
హైదరాబాద్కు షిఫ్ట్..
ఝార్ఖండ్ అసెంబ్లీలో 81 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 41 ఎమ్మెల్యేల బలం ఉంటే చాలు. సంకీర్ణ ప్రభుత్వానికి 43 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు బీజేపీకి (BJP) కూడా 35 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కొంత మంది ఎమ్మెల్యేలను పువ్వుపార్టీ లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు 43 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్కు (Hyderabad) తరలిస్తున్నారు. గురువారమే తరలించాలని చూసినా పొగమంచు కారణంగా విమాన ప్రయాణానికి అంతరాయం కలిగి ఆగిపోయారు. శుక్రవారం మాత్రం రెండు ప్రత్యేక విమానాల్లో ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఝార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష వరకూ ఎమ్మెల్యేలంతా ఇక్కడే మకాం వేయనున్నారు.
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
హైదరాబాద్కే ఎందుకు?
ఝార్ఖండ్కు చెందిన జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీకి చెందిన 43 మంది ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్కు తరలిస్తున్నారు. ప్రస్తుతం హిమాచల్ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎమ్మెల్యేలు భద్రంగా ఉండాలంటే హైదరాబాదే సేఫ్ అని ఏఐసీసీ భావించింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలను హైదరాబాద్కు షిఫ్ట్ చేస్తున్నారు. 10 రోజుల పాటు ఎమ్మెల్యేలంతా హైదరాబాద్లోనే మకాం వేయనున్నారు.
బలబలాలు ఇలా..
ఝార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలు ఉన్నాయి. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీకి 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక బీజేపీకి 35 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇంకో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కూటమి ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని.. వారితో బేరసారాలు నడుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్కు తరలిస్తున్నారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!