Jharkhand Election Results: జార్ఖండ్ కౌంటింగ్ పూర్తి.. ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వచ్చాయంటే?
- వెలువడ్డ జార్ఖండ్ 81 అసెంబ్లీ స్థానాల ఫలితాలు
- జేఎంఎం కూటమి భారీ విజయం
- ఇండియా కూటమికి 56 సీట్లు
- 24 స్థానాల్లో బీజేపీ కూటమి విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఇండియా భారీ విజయం సాధించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41ని దాటేసింది. ఇండియా కూటమి 56 స్థానాల్లో విజయం సాధించింది. జేఎంఎం34, కాంగ్రెస్ 16, సీపీఐ-ఎం(CPI-M) 2, ఆర్జేడీ (RJD) 4 కలిపి మొత్తం ఇండియా కూటమికి 56 సీట్లు వచ్చాయి. మరోవైపు బీజేపీ కూటమి 24 స్థానాల్లో గెలుపొందింది. అయితే బీజేపీ ఒంటరిగా 21 సీట్లు సాధించింది. బీజేపీ మద్దతుదారు ఏజేఎస్యూ పార్టీ (AJSU Party) 1, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 1, జనతాదళ్ (యునైటెడ్) 1 చొప్పున సీట్లు సాధించాయి.
కాగా.. జార్ఖండ్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అన్ని విధాలా ప్రయత్నించినా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీంతో పార్టీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. చివరకు బీజేపీ ఎక్కడ తప్పు చేసిందనేది ప్రశ్న పార్టీ నేతల్లో తలెత్తుతోంది. స్వయంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వంటి బీజేపీ అగ్రనేతలు దూకుడుగా ప్రచారం చేశారు. దాదాపు 200 ర్యాలీల్లో బీజేపీ నేతలు ప్రసంగించారు. వీటిలో దాదాపు రెండు డజన్ల బహిరంగ సభలను అమిత్ షా, ప్రధాని మోడీ నిర్వహించారు. అయినప్పటికీ ఎన్డీయే విజయం సాధించలేదు.
Also Read
- Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
- Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
సీఎం అభ్యర్థి లేకుండా పోరు..
ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ నిలబెట్టలేదు. ఎన్నికల్లో గిరిజన ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించక పోవడంతో బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని రాష్ట్ర బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. బయటి నుంచి వచ్చిన ఇద్దరు నేతలు ప్రచారం నిర్వహించారని మరో నేత పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ సొంత నేతలను విస్మరించి ఇతర పార్టీల నేతలకు టిక్కెట్లు ఇచ్చిందని ఆరోపించారు.
సమస్యలను లేవనెత్తడంలో బీజేపీ విఫలం..
మొత్తం ఎన్నికల ప్రచారంలో ప్రజలకు సంబంధించిన అట్టడుగు సమస్యలను లేవనెత్తడంలో బీజేపీ విఫలమైందని రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ బగీష్ చంద్ర వర్మ అన్నారు. దీంతో గ్రామీణ ప్రజలు బీజేపీలో చేరదీయలేదన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో జాతీయ అంశాలు, చొరబాట్లపై మాత్రమే దృష్టి సారించిందన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, గిరిజనులు జేఎంఎం సంప్రదాయ ఓటు బ్యాంకులని రాంచీ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి డాక్టర్ బగీష్ చంద్ర వర్మ అన్నారు. ఇది కాకుండా, జేఎంఎం18-50 సంవత్సరాల వయస్సు గల మహిళలను దాని ఫోల్డ్లో గెలుచుకుందని పేర్కొన్నారు. ఇందులో మైయా సమ్మాన్ యోజన కీలక పాత్ర పోషించిందని చెప్పారు. జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాల్లో 68 స్థానాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తెలిపారు.
జేఎల్కేఎం నష్టం కలిగించింది..
జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా (JLKM) కూడా అత్యధిక ఓట్లను గెలుచుకుంది. చందన్కియారి సీటులో లాగా బీజేపీ, ఏజేఎస్యూ (AJSU) పార్టీకి నష్టాన్ని కలిగించింది. చందంకియారి అసెంబ్లీ స్థానంలో ప్రతిపక్ష నేత అమర్ కుమార్ బౌరీ జేఎంఎంకు చెందిన ఉమాకాంత్ రజక్ చేతిలో ఓడిపోయారు. బీజేపీ మిత్రపక్షం ఏజేఎస్యూ 10 స్థానాల్లో, జేడీయూ రెండు స్థానాల్లో, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఒక స్థానంలో పోటీ చేశాయి.
తాజావార్తలు
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!