School Principal: ప్రిన్సిపాల్ అరాచకం.. స్కూల్కు రాలేదని పిల్లలను చితకబాదాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Principal: చెప్పకుండా బయటకు వెళ్లడమే ఆ విద్యార్థులు చేసిన నేరం. అందుకు స్కూల్ ప్రిన్సిపల్ వారిని కర్రతో వాతలొచ్చే వరకు చితకబాదాడు. ఈ ఘటన మంగళవారం జార్ఖండ్లోని పాలములోని సత్బర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని భోగు గ్రామంలో జరిగింది. స్కూల్కు రాలేదని విద్యార్థులను క్యూలో నిలబెట్టి విచక్షణారహితంగా ప్రిన్సిపాల్ చితకబాదారు. తరగతులకు ఎందుకు హాజరు కాలేదో కారణాలు చెప్పినప్పటికీ.. యూకేజీ నుంచి 5వతరగతి వరకు విద్యార్థులను క్యూలో నిలబెట్టి పాఠశాల ప్రిన్సిపాల్ చందన్ కుమార్ శర్మ విచక్షణారహితంగా కొట్టారు.
భోగు గ్రామంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న పిల్లలు తమ గ్రామమైన ఖమ్దీలో పవిత్ర శ్రావణ మాసం చివరి సోమవారం నిర్వహించిన ‘కలష్ యాత్ర’కు హాజరయ్యేందుకు వెళ్లినందున వారు గైర్హాజరయ్యారు. తరగతులకు హాజరుకాకపోవడానికి గల కారణాలు చెబుతున్నప్పటికీ, ప్రిన్సిపాల్ తమను కర్రతో విచక్షణారహితంగా కొట్టారని పిల్లలు చెబుతున్నారు. ‘కలష్ యాత్ర’కు వెళ్లామని చెప్తున్నా వాతలు తేలేలా తమను చితక బాదారని ఓ పిల్లాడు చెప్పాడు. వారిని క్యూలో నిలబెట్టి కొట్టారని, తల్లిదండ్రులతో ఏమీ చెప్పవద్దని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు విద్యార్థులు వెల్లడించారు.
Also Read
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
Also Read: TS High Court: ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
అనంతరం ఇంటికి వెళ్లిన అనంతరం విద్యార్థుల శరీరంపై వాతలు చూసి కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు.. స్థానిక పోలీసులను ఆశ్రయించారు.మరోవైపు ఈ విషయమై తమకు అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఘటనపై తనకు అందిన సమాచారంపై కసరత్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. తాము పాఠశాల ప్రిన్సిపాల్ను పిలిచి విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని సత్బర్వా పోలీస్ స్టేషన్ అధికారి అమిత్ కుమార్ సోని చెప్పారు.
పిల్లలు గోలీలు ఆడుతున్నట్లు గుర్తించి ఎవరో ఒక వీడియోను ప్రిన్సిపాల్కు పంపినట్లు సమాచారం. విద్యార్థులు గోలీలు ఆడుతున్నట్లు వీడియో చూసిన ప్రిన్సిపాల్ ఆగ్రహానికి గురై విద్యార్థులను కొట్టారని పోలీసులు తెలిపారు. అయితే ప్రిన్సిపాల్ పిల్లలను కొట్టి ఉండకూడదని అన్నారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని.. విచారణ పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
-
Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
-
Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
-
Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!