Jharkhand : జార్ఖండ్లోని లతేహర్ జిల్లాలో గురువారం పిడుగుపాటుకు ఇద్దరు ఫుట్బాల్ క్రీడాకారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బరియాతు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో మధ్యాహ్నం కొంతమంది అబ్బాయిలు ఫుట్బాల్ ఆడుతుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను దీపక్ కుమార్, వీరేంద్ర గంజులుగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. క్షతగాత్రులను కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్పించారు.
మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. గురువారం సాయంత్రం చివరి ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోందని తెలిపారు. మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే రెండు చోట్ల ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. దీని ధాటికి ఇద్దరు ఫుట్బాల్ ఆటగాళ్లు చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
Read Also:Joe Root: రోహిత్ శర్మ రికార్డును బద్దలుగొట్టిన రూట్!
చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
అనంతరం ఈ విషయాన్ని గమనించిన వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ గాయపడిన ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. క్షతగాత్రులందరికీ చికిత్స కొనసాగుతోంది. మృతుల్లో దీపక్ కుమార్, వీరేంద్ర గంజులు ఉన్నారు. మృతులిద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు.
ముగ్గురి పరిస్థితి విషమం
ఆసుపత్రిలో అందుతున్న సమాచారం ప్రకారం గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఘటనపై సమాచారం ఇస్తూ పిడుగుపాటుకు గాయపడిన 12 మందిని ఆస్పత్రికి తరలించినట్లు డాక్టర్ అమర్నాథ్ తెలిపారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అదే సమయంలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Read Also:SPY Camera: దారుణం.. ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ టాయిలెట్స్లో రహస్య కెమెరా..