Jharkhand : జార్ఖండ్లో పిడుగుపాటు.. ఇద్దరు యువ ఫుట్బాల్ ఆటగాళ్లు మృతి, 10 మంది గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand : జార్ఖండ్లోని లతేహర్ జిల్లాలో గురువారం పిడుగుపాటుకు ఇద్దరు ఫుట్బాల్ క్రీడాకారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బరియాతు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో మధ్యాహ్నం కొంతమంది అబ్బాయిలు ఫుట్బాల్ ఆడుతుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను దీపక్ కుమార్, వీరేంద్ర గంజులుగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. క్షతగాత్రులను కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్పించారు.
మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. గురువారం సాయంత్రం చివరి ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోందని తెలిపారు. మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే రెండు చోట్ల ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. దీని ధాటికి ఇద్దరు ఫుట్బాల్ ఆటగాళ్లు చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
Also Read
- Rohit Sharma: "నన్ను క్షమించు.." మహిళా అభిమానికి 'హిట్ మ్యాన్' స్పెషల్ రిక్వెస్ట్..!
- Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Virat Kohli: స్టాండ్స్లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
- Modi-Marco Rubio: వైట్హౌస్ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
Read Also:Joe Root: రోహిత్ శర్మ రికార్డును బద్దలుగొట్టిన రూట్!
చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
అనంతరం ఈ విషయాన్ని గమనించిన వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ గాయపడిన ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. క్షతగాత్రులందరికీ చికిత్స కొనసాగుతోంది. మృతుల్లో దీపక్ కుమార్, వీరేంద్ర గంజులు ఉన్నారు. మృతులిద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు.
ముగ్గురి పరిస్థితి విషమం
ఆసుపత్రిలో అందుతున్న సమాచారం ప్రకారం గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఘటనపై సమాచారం ఇస్తూ పిడుగుపాటుకు గాయపడిన 12 మందిని ఆస్పత్రికి తరలించినట్లు డాక్టర్ అమర్నాథ్ తెలిపారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అదే సమయంలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Read Also:SPY Camera: దారుణం.. ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ టాయిలెట్స్లో రహస్య కెమెరా..
తాజావార్తలు
-
Rohit Sharma: “నన్ను క్షమించు..” మహిళా అభిమానికి ‘హిట్ మ్యాన్’ స్పెషల్ రిక్వెస్ట్..!
-
Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Film Chamber: ఆ కలరింగ్ అంతా అబద్ధం.. ‘పెద్ది’ పర్సెంటేజ్ డీల్ను తిరస్కరించిన ఎగ్జిబిటర్లు
-
Virat Kohli: స్టాండ్స్లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
-
Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా.. గుజరాత్ స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ..!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!