Jerusalem: జెరూసలేంలో రక్తపాతం .. హమాస్ కాల్పుల్లో ఇజ్రాయెల్ పౌరులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jerusalem: ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేంలో దారుణం చోటుచేసుకుంది. జెరూసలేంలోని రామోట్ ప్రాంతంలో పట్టపగలు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించగా, 15 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడికి హమాస్ బాధ్యత వహించింది. దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అత్యవసర భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పలు నివేదికలు బయటికి వచ్చాయి.
READ ALSO: Senior IAS Officers Transferred in AP: ఏపీలో 11 మంది సీనియర్ ఐఏఎస్ల బదిలీలు..
Also Read
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
- సొంతిల్లు లేని వారికి గుడ్న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
దాడి ఎక్కడ జరిగిందంటే..
జెరూసలేంలోని రామోట్ ప్రాంతంలో రద్దీగా ఉండే బస్ స్టాప్ దగ్గర ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఉన్నట్లుండి ఇద్దరు దుండగులు ఒక బస్సు ఎక్కి కాల్పులు ప్రారంభించారు. వెంటనే భద్రతా దళాలు వారిని అక్కడికక్కడే హతమార్చాయి. దాడి చేసిన వారు వెస్ట్ బ్యాంక్కు చెందిన పాలస్తీనియన్లు అని భద్రతా అధికారులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జెరూసలేంలో జరిగిన దాడిని హమాస్ ప్రశంసించింది. ఈ దాడిని వీరోచిత ఆపరేషన్ అని హమాస్ నాయకత్వం అభివర్ణించింది. ‘ఈ దాడి మన ప్రజలపై జరిగిన విధ్వంసక యుద్ధానికి ప్రతిస్పందన’ అని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్లో సోమవారం చోటుచేసుకున్న కాల్పుల సంఘటన 2024 అక్టోబర్ తర్వాత జరిగిన అతిపెద్ద కాల్పుల ఘటన. గత ఏడాది వెస్ట్ బ్యాంక్కు చెందిన ఇద్దరు పాలస్తీనియన్లు టెల్ అవీవ్లోని ఒక రైల్వే స్టేషన్పై కాల్పులు జరిపి 7 మందిని చంపారు. ఈ దాడికి హమాస్ బాధ్యత వహించింది. రామోట్ జంక్షన్ కాల్పులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించాయి.
సంఘటనా స్థలానికి జాతీయ భద్రతా మంత్రి..
రామోట్లోని సంఘటనా స్థలానికి ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్ గ్విర్ చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయన అక్కడి పరిస్థితిని పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాల్పుల తర్వాత ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్ బ్యాంక్లోని రామల్లా శివార్లలోని అనేక పాలస్తీనా గ్రామాలలో గస్తీ పెంచింది. తాజాగా దాడి చేసిన వారు ఈ గ్రామాల నుంచి జెరూసలేం చేరుకున్నారని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.
READ ALSO: Mirai : చిరంజీవి అలా అంటారని అనుకోలేదు.. తేజసజ్జా కామెంట్స్
తాజావార్తలు
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!