Jerusalem: జెరూసలేంలో రక్తపాతం .. హమాస్ కాల్పుల్లో ఇజ్రాయెల్ పౌరులు మృతి
Jerusalem: ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేంలో దారుణం చోటుచేసుకుంది. జెరూసలేంలోని రామోట్ ప్రాంతంలో పట్టపగలు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించగా, 15 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడికి హమాస్ బాధ్యత వహించింది. దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అత్యవసర భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పలు నివేదికలు బయటికి వచ్చాయి.
READ ALSO: Senior IAS Officers Transferred in AP: ఏపీలో 11 మంది సీనియర్ ఐఏఎస్ల బదిలీలు..
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
దాడి ఎక్కడ జరిగిందంటే..
జెరూసలేంలోని రామోట్ ప్రాంతంలో రద్దీగా ఉండే బస్ స్టాప్ దగ్గర ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఉన్నట్లుండి ఇద్దరు దుండగులు ఒక బస్సు ఎక్కి కాల్పులు ప్రారంభించారు. వెంటనే భద్రతా దళాలు వారిని అక్కడికక్కడే హతమార్చాయి. దాడి చేసిన వారు వెస్ట్ బ్యాంక్కు చెందిన పాలస్తీనియన్లు అని భద్రతా అధికారులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జెరూసలేంలో జరిగిన దాడిని హమాస్ ప్రశంసించింది. ఈ దాడిని వీరోచిత ఆపరేషన్ అని హమాస్ నాయకత్వం అభివర్ణించింది. ‘ఈ దాడి మన ప్రజలపై జరిగిన విధ్వంసక యుద్ధానికి ప్రతిస్పందన’ అని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్లో సోమవారం చోటుచేసుకున్న కాల్పుల సంఘటన 2024 అక్టోబర్ తర్వాత జరిగిన అతిపెద్ద కాల్పుల ఘటన. గత ఏడాది వెస్ట్ బ్యాంక్కు చెందిన ఇద్దరు పాలస్తీనియన్లు టెల్ అవీవ్లోని ఒక రైల్వే స్టేషన్పై కాల్పులు జరిపి 7 మందిని చంపారు. ఈ దాడికి హమాస్ బాధ్యత వహించింది. రామోట్ జంక్షన్ కాల్పులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించాయి.
సంఘటనా స్థలానికి జాతీయ భద్రతా మంత్రి..
రామోట్లోని సంఘటనా స్థలానికి ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్ గ్విర్ చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయన అక్కడి పరిస్థితిని పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాల్పుల తర్వాత ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్ బ్యాంక్లోని రామల్లా శివార్లలోని అనేక పాలస్తీనా గ్రామాలలో గస్తీ పెంచింది. తాజాగా దాడి చేసిన వారు ఈ గ్రామాల నుంచి జెరూసలేం చేరుకున్నారని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.
READ ALSO: Mirai : చిరంజీవి అలా అంటారని అనుకోలేదు.. తేజసజ్జా కామెంట్స్
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!