Terrible Incident: పురిటి నొప్పులతో ఆసుపత్రికి గర్భిణి.. సిబ్బంది నిర్లక్ష్యంతో గర్భంలోనే శిశువు మృతి..
- పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన గర్భిణి..
- ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో గర్భంలోనే శిశువు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrible Incident: పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన గర్భిణికి ప్రసవం చేయాల్సిన వైద్యాధికారి, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో గర్భంలోనే శిశువు మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాటారం మండలం చిదినెపల్లికి చెందిన కొండు హరిత పురిటి నొప్పులతో అక్టోబర్ 28న కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. పరీక్షించిన వైద్యురాలు నొప్పులు రావడానికి ఇంజక్షన్ ఇచ్చారని బాధితురాలు తెలిపారు. అక్టోబర్ 29న సాయంత్రం నొప్పులు ఎక్కువ కావడంతో వైద్యురాలు, సిబ్బంది సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. నొప్పి భరించలేక పోతున్నాని శస్త్రచికిత్స చేయాలని వైద్యురాలిని కోరినా సాధారణ ప్రసవం అవుతుందని అలాగే పొట్టను గట్టిగా నెట్టారని తెలిపారు. బుధవారం ఉదయం ఉమ్ము నీరు మొత్తం బయటకు పోయినా వైద్యురాలు వచ్చి సాధారణ ప్రసవం అవుతుందని తెలిపి మళ్లీ పొట్టను నెట్టే ప్రయత్నం చేస్తే తనను జిల్లా ఆసుపత్రికి పంపించాలని కోరినట్లు చెప్పారు.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
కడుపులో శిశువు కదలికలు ఆగిపోవడంతో హార్ట్ బీట్ ఎలా ఉందని వైద్యాధికారిని అడిగితే బాగానే ఉందని పంపించారన్నారు. అక్కడి నుంచి జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చాక అక్కడి వైద్యాధికారులు శస్త్ర చికిత్స చేయగా అప్పటికే శిశువు మృతి చెందిందని వైద్యులు తెలిపినట్లు ఆమే పేర్కొన్నారు. కాటారం పీహెచ్సీ వైద్యురాలు నిర్లక్ష్యంతోనే గర్భస్థ శిశువు మృతి చెందిందని తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వైద్యులు, సిబ్బంది వున్నంత కాలం గర్భంలోనే శిశువులను పోగొట్టుకోవాల్సి వస్తుందని వాపోయింది. ఇప్పటికైనా కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులను, సిబ్బంది తొలగించాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేదానిపై ఆశక్తి నెలకొంది.
Telangana: బాబోయ్ పులి.. నిర్మల్ రైతులకు దడ పుట్టిస్తున్న బెబ్బులి..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!