టాలీవుడ్ లెజెండ్, సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ‘ఆర్ఎక్స్ 100’ వంటి కల్ట్ హిట్ సినిమాల దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్తో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ను సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ సమర్పిస్తుండగా, చందమామ కథలు బ్యానర్పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ముఖ్యమైన షెడ్యూల్స్ పూర్తికాగా, తిరుపత దాని పరిసర ప్రాంతాల్లోని హిందూ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో ఈ కథ సాగనుంది.
Also Read : Valentine’s Day Releases : వాలెంటైన్స్ డే రేస్లో మూడు సినిమాలు.. గెలిచిందెవరు?
విష్ణువు స్వయంభువుగా వెలిసిన ఈ క్షేత్రంలో జరిగిన ఒక యదార్థ గాథ ఆధారంగా ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీని అజయ్ భూపతి మలుస్తున్నారట. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. చిత్ర క్లైమాక్స్లో వచ్చే ఒక అత్యంత కీలకమైన పాత్ర కోసం చిత్ర యూనిట్ ఒక సీనియర్ హీరోయిన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. సినిమా మలుపు తిప్పే ఈ స్పెషల్ రోల్ కోసం ఆమె దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కుమార్తె రషా తదాని ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఘట్టమనేని వారసుడి తొలి సినిమా కావడంతో మే 31న (కృష్ణ జయంతి సందర్భంగా) ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.