Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో ‘జై షా’ కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jay Shah: 2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్కు ముందు నిర్వహించిన ‘కెప్టెన్స్ కార్నివల్’ కార్యక్రమంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఇంగ్లాండ్లో ఆదివారం (జూన్ 7)న జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఐసీసీ ఛైర్మన్ జయ్ షా.. పాకిస్థాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనాతో కరచాలనం చేయడంతో అది కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమంలో భారత్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో పాటు టోర్నీలో పాల్గొనే 12 జట్ల కెప్టెన్లు హాజరయ్యారు.
కార్యక్రమం సందర్భంగా జై షా అన్ని జట్ల కెప్టెన్లను కలిసి అభినందించారు. ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాతో ఆయన హ్యాండ్షేక్ చేయడం కెమెరాల్లో చిక్కడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై భారత, పాకిస్థాన్ అభిమానులు భిన్నంగా స్పందించారు. కొందరు పాకిస్థాన్ అభిమానులు గతంలో భారత క్రికెట్ జట్టు అనుసరించిన ‘నో హ్యాండ్షేక్’ విధానాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. మరోవైపు భారత అభిమానులు మాత్రం.. జై షా ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ హోదాలో ఉన్నందున అన్ని జట్లను సమానంగా గౌరవించడం ఆయన బాధ్యత అని అభిప్రాయపడ్డారు.
Also Read
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
గతంలో భారత్, పాకిస్థాన్ సంబంధాల నేపథ్యంలో ఇరు దేశాల క్రికెట్ జట్ల మధ్య హ్యాండ్షేక్ అంశం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత జట్టు పాకిస్థాన్ ఆటగాళ్లతో అధికారిక కార్యక్రమాల్లో దూరంగా ఉండటం వార్తల్లో నిలిచింది. ఆ నేపథ్యంలో జై షా చేసిన ఈ కరచాలనం మరోసారి చర్చకు కారణమైంది. ఇదిలా ఉంటే.. 2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ జూన్ 12న ఇంగ్లాండ్, శ్రీలంక మ్యాచ్తో ప్రారంభం కానుంది. టోర్నీలో అత్యంత ఆసక్తికర పోరు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 14న బర్మింగ్హామ్ లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో జరగనుంది. కాగా, గత ఎడిషన్ విజేతలైన న్యూజిలాండ్ మహిళల జట్టు ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది.
తాజావార్తలు
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!