Japan: భార్య కోసం పదేళ్లుగా సముద్రంలో వెతుకుతున్న భర్త.. దిస్ ఈజ్ రియల్ లవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japan: అది 2011 మార్చి 11వ తేది. జపాన్ సముద్ర గర్భంలో భూకంపం కారణంగా ఏర్పడిన సునామీ ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలుసు. కొన్ని వేల మంది చనిపోయారు. మరెందరో గల్లంతయ్యారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు చనిపోయిన వారు 20వేల మంది. దాదాపు 4.50 లక్షల మంది ఇండ్లు కోల్పోయని అంచనా.. జపాన్లో 11 ఏండ్ల క్రితం సంభవించిన సునామిని ఇప్పటికీ ఎవరూ మర్చిపోవడం లేదు. ఈ సునామి రగిల్చిన ఆవేదన, మిగిల్చిన విషాదాల తాలూకు స్మృతులను నెమరేసుకుంటూ ఎందరో జీవచ్చవాలుగా బతుకులీడుస్తున్నారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం తన భార్య మృతదేహాన్ని దొరకబుచ్చుకునేందుకు గత 10 ఏండ్లుగా సముద్రంలో డైవింగ్ చేస్తున్నాడు. ఏనాటికైనా ఆమె మృతదేహం దొరక్కపోతుందా అనే చిన్న ఆశ.. ఆయనను వారం వారం సముద్రంలో వెతికేలా చేస్తున్నది.
Read Also: Premature Births : ముందస్తు ప్రసవాలకు ఆందోళనలే కారణమా..?
Also Read
- Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
ఈ ఘటన ఉత్తర జపాన్కు చెందిన యసువో తకమత్సు జీవితంలో కూడా కల్లోలం రేపింది. సునామీలో తకమత్సు భార్య గల్లంతైంది. సముద్రంలో భార్య మృతదేహాన్ని దొరకపట్టుకోవడానికి ఈ పెద్ద మనిషి స్కూబా డైవింగ్ నేర్చుకుని ప్రభుత్వం నుంచి లైసెన్స్ కూడా పొందాడు. ప్రతి వారం సముద్రంలో డైవింగ్ చేస్తూ 2013 నుంచి భార్య మృతదేహం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా వెతుకుతున్నాడు. తన భార్య అంటే తనకు ఎంతో ప్రేమ అని, ఆమె మృతదేహం దొరికేంత వరకు వెదుకుతూనే ఉంటా అని చెప్తున్నాడు యసువో తకమత్సు. సునామీ సంభవించిన తొలినాళ్లలో సముద్రం ఒడ్డున పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తరలించడంలో పనిచేసిన తకమత్సుకు.. భార్య వాడిన ఫోన్ దొరికింది. దాంతో ఆనాటి నుంచి భార్య జాడ కోసం శ్రమించడం మొదలెట్టాడు.
Read Also: Washington : అక్కడ తినడమే అతను చేసిన నేరం.. అందుకే ఫైరింగ్
భూమిపై ఆనవాళ్లు దొరక్కపోవడంతో.. 2013 నుంచి సముద్రంలో డైవింగ్ చేస్తూ ఆశగా సెర్చ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన వయసు 65. ‘నువ్వు బాగున్నావా.. నేను ఇంటికి పోవాలనుకుంటున్నా..’ అని చివరిసారిగా తనకు మెసేజ్పెట్టిందని తకమత్సు గుర్తు చేసుకున్నాడు. చెత్తలో దొరికిన ఫోన్లో సెండ్కాని మెసేజ్ ‘సునామీ వినాశకరంగా ఉన్నది’ అని రాసి ఉన్నది. ఇలాఉండగా, సునామి కారణంగా ఇప్పటికీ దాదాపు 2,500 మంది కనిపించడం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది.
తాజావార్తలు
-
Karuppu : 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. సింగం – 2 వసూళ్లను బ్రేక్ చేసిన ‘వీరభద్రుడు’
-
Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
-
Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
-
Riyan Parag: తప్పంతా నాదే, మేం ప్లేఆఫ్స్కు అర్హులం కాదు.. రాజస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..