Premature Births : ముందస్తు ప్రసవాలకు ఆందోళనలే కారణమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Premature Births : అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతీ స్త్రీ ఆరాటపడుతూ ఉంటుంది. తల్లి కావడం అనేది స్త్రీలకు దేవుడిచ్చిన వరం. గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు తన జన్మ సంపూర్ణమైందని అనుకుంటుంది. అయితే… ఆ అమ్మ అనే పిలుపు అందుకోవడానికి 9 నెలల పాటు తన కడుపులో బిడ్డను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే… మనకు తెలీకుండానే… బిడ్డను కడుపులో మోసే క్రమంలో ఎక్కువగా స్త్రీలు ఆందోళనకు గురౌతూ ఉంటారట. ఈ ఆందోళన కారణంగా…. బిడ్డ పుట్టాల్సిన సమయం కన్నా… ముందుగానే అంటే… ప్రీ మెచ్యూర్ డెలివరీలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల చేసిన పలు పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఆందోళనను ఎదుర్కొనే గర్భిణుల్లో నెలలు నిండకుండానే ప్రసవాలు జరిగే ప్రమాదం ఉంటుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది.
Read Also: Washington : అక్కడ తినడమే అతను చేసిన నేరం.. అందుకే ఫైరింగ్
Also Read
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
- Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
- Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
- Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
బిడ్డ జన్మించే పరిస్థితులను గర్భిణి మానసిక స్థితి కచ్చితంగా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు స్పష్టం చేశారు. ‘‘ప్రతి నలుగురిలో ఒకరు ఆందోళనను ఎదుర్కొంటారని గత అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది బిడ్డ జన్మించే సమయంలో తీవ్రంగా ప్రభావం చూపించవచ్చు. అమెరికాలోని డెన్వెర్, లాస్ ఏంజిలిస్ ప్రాంతాల్లో మొత్తం 196 మంది గర్భిణులపై మా అధ్యయనాన్ని నిర్వహించాం. వీరిలో తొలి, మూడో త్రైమాసికాల్లో ఆందోళన స్థాయులను పరిశీలించాం. సాధారణ ఆందోళన, గర్భం సంబంధిత ఆందోళన గురించి విడివిడిగా ప్రశ్నలు అడిగి సమాధానాలు సేకరించాం. మూడో త్రైమాసిక సమయంలో తమ గర్భం గురించి ఆందోళన చెందిన మహిళల్లో ప్రసవం 9 నెలలు నిండకుండానే జరుగుతున్నట్లు గుర్తించాం. ఇక తొలి త్రైమాసికంలో వారిలో ఉన్న ఇతర ఆందోళనలు కూడా ఇదే తరహాలో ముందస్తు ప్రసవానికి కారణమైనట్లు తేలింది. ఆఖరి త్రైమాసికంలో గర్భిణుల్లో ఎక్కువగా వైద్యపరమైన భయాలు, శిశువు ఎలా జన్మిస్తుందోనన్న ఆందోళనలు, డెలివరీ గురించిన ఒత్తిడి వంటివి ఎక్కువగా ఉన్నాయి’’ అని పరిశోధకులు స్పష్టం చేశారు. వైద్యులు గర్భిణుల్లో తొలి త్రైమాసికంలో ఒత్తిడి, ఆందోళనలను గమనించి, ముందుగానే సరైన మార్గదర్శనం చేయాలని వారు సూచించారు.
తాజావార్తలు
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..