Janhvi Kapoor : మోకాళ్ళపై తిరుమల మెట్లు ఎక్కిన జాన్వీ కపూర్.. వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వుంది.బాలీవుడ్ లో వరుస చిత్రాలలో నటిస్తూనే టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ లో ఆఫర్స్ అందుకుంటుంది. ఇప్పటికే ఈ భామ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం అందరికి తెలిసిందే.. ఇక ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే మరో పాన్ ఇండియా మూవీ ఆఫర్ ను అందుకుంది.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్సీ 16’లో ఈ భామ హీరోయిన్ గా ఎంపిక అయింది.నిన్ననే ఈ మూవీ ప్రారంభోత్సవం కూడా ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ మూవీ ప్రారంభానికి ముందు జాన్వీ ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకుంది.ఆమెతో పాటు సీనియర్ నటి మహేశ్వరి, జాన్వీ కపూర్ బాయ్ ఫ్రండ్ తో పాటు బీ-టౌన్ సెలబ్రిటీ స్టైలిస్ట్ ఓరీ కూడా దేవస్థానాన్ని సందర్శించారు..
ఈ సందర్భంగా వ్లాగ్ చేసిన అతడు అప్పుడు తీసిన వీడియో ప్రస్తుతం తన యూట్యూబ్ చానల్లో షేర్ చేశాడు. ఇందులో జాన్వీ కపూర్ కాలినడకన తిరుమల కొండ ఎక్కి తన మొక్కు చెల్లించుకుంది. ఈ సందర్భంగా ఆమె మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కింది .ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా శ్రీవారి దర్శనంలో భాగంగా వీరు తిరుపతి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్న జాన్వీ కపూర్ మోకాళ్లపై మోకాళ్ల పర్వతం మెట్లెక్కింది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ గా మారింది.ఇదిలా ఉంటే నిన్న ఆర్సీ 16 పూజా కార్యక్రమంలో జాన్వీ చీరకట్టులో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ఆమె తన తండ్రి బోణీ కపూర్ తో కలిసి పాల్గొంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఈ మూవీ పూజ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏఆర్ రెహమాన్, నిర్మాత అల్లు అరవింద్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వంటి తదితర టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. కాగా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?