Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Janasena Pac Chairman Nadendla Manohar Fires On Cm Ys Jagan Over Cbse Students Issue

Nadendla Manohar: ఏపీ ప్రభుత్వ నిర్ణయాలతో.. 85,350 మంది విద్యార్థుల భవిష్యత్‌ నాశనం..!

Published Date :December 14, 2023 , 12:17 pm
By Sudhakar Ravula
Nadendla Manohar: ఏపీ ప్రభుత్వ నిర్ణయాలతో.. 85,350 మంది విద్యార్థుల భవిష్యత్‌ నాశనం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nadendla Manohar: ప్రభుత్వ నిర్ణయాల వల్ల 85,350 మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందంటూ ఫైర్‌ అయ్యారు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌.. సీబీఎస్ఈ విద్యార్థుల భవితవ్యంపై నాదెండ్ల సీరియస్ కామెంట్లు చేశారు.. ప్రభుత్వ తప్పిదాల వల్ల 85 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నారని మండిపడ్డారు.. సీబీఎస్ఈ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థుల పరీక్షల నిమిత్తం ప్రభుత్వం కట్టాల్సిన ఎగ్జామినేషన్ ఫీజు ఇప్పటి వరకు కట్టలేదన్న ఆయన.. ఈ మొత్తం సుమారుగా రూ. 2 కోట్లకు పైగా ఉంటుంది. ఈ 85 వేల మంది విద్యార్ధులు పరీక్షలు రాయలేకపోతే.. వారి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా మారుస్తున్నామంటూ వారిని జీవితాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. అయితే, ఈ పాపంలో మంత్రి బొత్స సత్యనారాయణ తప్పేం లేదు.. కానీ, జగన్ మామ చేసిన పాపం విద్యార్థులకు శాపంగా మారిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 44,639 పాఠశాలల్ని 2024 నాటికి సీబీఎస్ఈ కిందకు తెస్తామని జగన్ సర్కార్ చెప్పింది.. కానీ, కేవలం 1000 స్కూళ్లకే సీబీఎస్ఈ అఫిలియేషన్ తీసుకురాగలిగారని.. ఆ వేయి పాఠశాలల్లో కూడా విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల్లేవు అని దుయ్యబట్టారు నాదెండ్ల.. పరీక్షలు నిర్వహించడానికి వీల్లేని పరిస్థితుల్లో వేయి సీబీఎస్ఈ పాఠశాలలు ఉన్నాయి. వేయి పాఠశాలల్లో సైన్స్ లాబరేటరీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కేవలం 700కు పైగా పాఠశాలల్లో మాత్రమే ఏర్పాటు చేశారు. అలాగే, లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేయలేదు. 40 వేలకు పైగా కంప్యూటర్లు కొనుగోలు చేయాల్సి ఉండగా.. కేవలం 12 వేల కంప్యూటర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ వసతులు లేనిదే సీబీఎస్ఈ పరీక్షలు రాయడం కుదరదు. ఈ విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షలు రాయాలా..? స్టేట్ సిలబస్ పరీక్షలు రాయాలా..? బిడ్డల భవిష్యత్తును ఇంత దారుణంగా నాశనం చేస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read

  • CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
  • UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
  • Gudivada Amarnath: డేటా సెంటర్‌పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
  • Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!

బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తున్నందుకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు నాదెండ్ల మనోహర్‌.. సీబీఎస్ఈనే అమలు చేయలేని వారు.. ఐబీ సిలబస్ ఎలా అమలు చేస్తారు..? మరో రెండు నెలల్లో పరీక్షలు రాయాల్సి ఉండగా 85 వేల విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మార్చి నెలలో జరిగే పరీక్షల్లో వీరికి ఇబ్బంది లేకుండా చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. మేం అన్ని ఆధారాలతోనే వరుస ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెడుతున్నాం అన్నారు. మేం మీడియాతో మాట్లాడితే ఏదో విమర్శించేసి వెళ్లిపోవడం సరైన విధానం కాదు. నియోజన్ సంస్థ కోర్టుకెళ్తే.. ప్రభుత్వం అర్బిట్రేషన్ చేయాల్సిన అవసరమేంటి..? నియోజన్ సంస్థ ఇచ్చిన డీపీఆర్ ఏంటో మంత్రి అమర్నాథ్‌ విడుదల చేయగలరా? అని నిలదీశారు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CBSE Students
  • CM YS Jagan
  • janasena
  • nadendla manohar

తాజావార్తలు

  • CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!

  • UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..

  • Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్‌కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!

  • Food poisoning: బిర్యానీ, వాటర్‌మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?

  • Dhanush: రామ్ చరణ్‌ కాదంట.. ధనుష్‌తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions