Avanigadda: అవనిగడ్డ జనసేనలో ఆరని చిచ్చు..! బుద్ధప్రసాద్పై సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avanigadda: అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీలో.. మండలి బుద్ధప్రసాద్ చేరికతో మొదలైన చిచ్చు ఆరడంలేదు.. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కు టీడీపీలో టికెట్ దక్కలేదు.. దీంతో, ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో.. పార్టీ కండువా కప్పుకున్నారు.. ఈ సారి ఆయన జనసేన పార్టీ నుంచి గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.. అంతేకాదు.. జనసేనాని నుంచి టికెట్పై హామీ వచ్చిన తర్వాతే.. ఆయన సైకిల్ దిగారని టాక్ నడుస్తోంది. కానీ, అవనిగడ్డ అభ్యర్థిపై జనసేన హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక, మండలి బుద్ధ ప్రసాద్… జనసేన పార్టీలో చేరికను నిరసిస్తూ ఈ రోజు అవనిగడ్డలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్పై విచురుకుపడ్డారు విక్కుర్తి శ్రీనివాస్.
Read Also: Bandi Sanjay: ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ చేతులెత్తేసింది..! బండి కీలక వ్యాఖ్యలు
Also Read
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
అవనిగడ్డ నియోజకవర్గానికి నిన్న బ్లాక్ డేగా అభివర్ణించారు విక్కుర్తి శ్రీనివాస్.. జనసేన పార్టీని అవమానించి అవహేళన చేసిన వ్యక్తి మండలి బుద్ధ ప్రసాద్ అని విమర్శించారు. జనసేన చిన్న పిల్లల పార్టీ అని చులకన చేసిన వ్యక్తి బుద్ధప్రసాద్ అని గుర్తుచేశారు. 40 శాతం ఓట్లు ఉన్న టీడీపీ వదిలి 6 శాతం ఓట్లు ఉన్న జనసేన పార్టీలోకి వెళ్లేదిలేదన్నాడు.. కానీ, ఇప్పుడు అదే పార్టీలో చేరారని మండిపడ్డారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పొరపాటున కూడా బుద్ధప్రసాద్ కి టికెట్ ఇస్తారని అనుకోవటం లేదన్నారు. ఇలాంటి వ్యక్తిని పవన్ కల్యాణ్ ప్రోత్సహించరు, జనసైనికులు కూడా అంగీకరించరని స్పష్టం చేశారు. ప్రపంచమంతా నైతిక విలువల గురించి స్పీచ్ లు ఇచ్చే వ్యక్తి.. నైతిక విలువలు మరిచి రాజకీయాలు చేస్తున్నారు అంటూ మండలి బుద్ధప్రసాద్పై విరుచుకుపడ్డారు జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్.
తాజావార్తలు
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!