Kiran Royal: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు జనసేన తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్.. ఈ మధ్య కిరణ్ రాయల్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు హల్ చల్ చేయడం.. వాటికి ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగిపోయాయి.. అయితే, నా మీద విష ప్రచారం చేయడానికి వైసీపీ సోషల్ మీడియా వంద కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు.. రాష్ట్రం మొత్తం నన్ను తప్పుగా చూపిస్తూ.. పార్టీని డ్యామెజ్ చేయాలని కుట్ర పన్నారు.. ఎన్నికల ముందు లక్ష్మీతో అభినయ్ రెడ్డి ఒప్పందం కూర్చుకున్నాడు.. కిరణ్ రాయల్ కు తిరుపతి సీటు వస్తే.. అప్పుడు ఇలాంటి ప్రచారం చేయాలి.. పది కోట్లు ఇస్తామని లక్ష్మీతో అగ్రిమెంట్ చేసుకున్నాడు అభినయ్ రెడ్డి అని విమర్శించారు.. భూమన కరుణాకర్ రెడ్డి ఎలా తిరుపతి వచ్చాడు.. జిరాక్స్ షాపులో పెట్టుకున్న వ్యక్తికి వందల కోట్ల ఆస్తి ఎలా వచ్చింది..? అని నిలదీశారు..
Read Also: Bird Flu: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. కోళ్ల ఫారాల్లో తనిఖీలకు కలెక్టర్ ఆదేశాలు..
ఇక, తిరుపతి ప్రజలు భూమన కుటుంబాన్ని ఎప్పుడూ నమ్మరు అని వ్యాఖ్యానించారు కిరణ్ రాయల్.. నా ఫొటోలను మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారం చేసుకుంటున్నారు.. నా ఫొటోలు వాడినా వారిపై పరువు నష్టం దావా వేస్తున్నానని హెచ్చరించారు.. హానీ ట్రాప్ కాదు.. మనీ ట్రాప్.. లక్ష్మీతో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేయించారు.. లక్ష్మీ రెడ్డి అనే మహిళ నాకు తెలియదని కాణిపాకం వచ్చి అభినయ్ రెడ్డి ప్రమాణం చేస్తాడా..? అని సవాల్ విసిరారు.. మహిళను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం వీరికే చెల్లిందని ఫైర్ అయ్యారు.. నా మీద చేసినా కుట్రపై కోర్టు కేసులు వేస్తానని హెచ్చరించారు జనసేన నేత కిరణ్ రాయల్..