Pawan Kalyan: ఒక్క కులం వల్ల అధికారం రాదు.. పవన్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: కులాల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ అభివృద్ధి సాధించలేమని జనసేన అధినేత పవన్కళ్యాణ్ వెల్లడించారు. వారాహి యాత్రలో భాగంగా మచిలీపట్నంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. మచిలీపట్నానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం ,పెడన, కైకలూరు కలిపితే అద్బుతమైన ప్రాంతం అవుతుందన్నారు. జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య ఆకలితో చనిపోయారంటే కడుపు తరుక్కుపోయిందన్నారు.
ఒక్క కులం వల్ల అధికారం రాదన్నారు జనసేన అధినేత పవన్. నేను కాపు కులంలో పుట్టానని, అలా అని కేవలం కాపు ఓట్ బ్యాంక్ తీసుకుంటే ఎక్కడ ఎదుగుతామన్న పవన్.. అలా ఆలోచిస్తే కులనాయకుల్లా మిగిలిపోతామన్నారు. ఒక కులానికి అంటగట్టి నన్ను ఎందుకు కులనాయకుడ్ని చేస్తారని ప్రశ్నించారు.రాజమండ్రిలో మాట్లాడుతూ కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమన్నాను.. ఏపీలో కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టే అలా అన్నానని పవన్ తెలిపారు. జనసేన సాధారణ ప్రాంతీయ పార్టీ కాదని.. దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని ఆవిర్బవించిన పార్టీ అని ఆయన తెలిపారు. మున్ముందు జనసేన భావజాలమే దేశమంతా వ్యాపిస్తుందని పవన్ వెల్లడించారు. రాజధానికి 30 వేల ఎకరాలు అన్నప్పుడు ఆరోజు విభేదించానని ఆయన చెప్పుకొచ్చారు. రాజధాని అనేది రాత్రికి రాత్రే అభివృద్ధి కాదన్నారు. జగన్ను చిన్నప్పటి నుంచీ చూస్తున్నానని, రాష్ట్రానికి జగన్ సరైన వ్యక్తి కాదని ఆనాడే అనుకున్నానని పవన్ వెల్లడించారు.
Also Read
Also Read: TDP Deeksha: దీక్ష విరమించిన టీడీపీ నేతలు.. లోకేష్, భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు
జనసేన పార్టీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “బీఎస్పీ నుంచి 20 ఏళ్లు కష్టపడితే మాయావతి సీఎం అయ్యారు. పార్టీ పెట్టగానే ముఖ్యమంత్రి అయిపోవాలని లేడీకి లేచిందే పరుగులా ఆలోచించను. ఎన్టీఆర్కు మాత్రమే అలా సాధ్యమైంది. రాజధాని ఎక్కడ అంటే మూడు చోట్ల అని చెప్పుకోవాలా..?. తెలుగుదేశాన్ని పాలసీ పరంగానే విభేదించాను. ముప్పైవేల ఎకరాల గురించి విభేదించాను. వైసీపీ మీద వ్యక్తిగతం ద్వేషంలేదు. చిన్నప్పటి నుండి జగన్ని చూస్తున్నాను.. టీనేజ్లో ఎస్సైని కొట్డిన ఘటన చూశాను.. జగన్ రాష్ట్రానికి సరికాదని మద్దతు ఇవ్వలేదు. బ్రాహ్మణులను ద్వేషించని పార్టీ బీఎస్పీ, వాళ్లతోనే జత కలిసి సీఎం అయింది మాయావతి. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ భారత రాష్ట్ర సమితి అయిపోయింది. సనాతన ధర్మం బలంగా నమ్ముతాను, సర్వమతాలను ఆదరించే నేల అదే సనాతన ధర్మం.స్థానిక ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పనిచేస్తుంటే ఏం జరుగుతుందో అర్దమయ్యేది కాదు.” అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..