Pawan Kalyan: మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్.. ఉపాధి కల్పనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కడలినీ, కాయ కష్టాన్నీ నమ్ముకొని ఆటుపోట్లతో జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు.. మత్స్యకారుల సంక్షేమం.. ఉపాధి కల్పనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిఏదీ ఏది? అని నిలదీశారు. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో మత్స్యకారుల సంక్షేమం ఆ దిశగా అడుగులు వేస్తాం. మెరైన్ ఫిషింగ్ కి తగ్గట్లు సుదీర్ఘ తీరం ఉన్న మన రాష్ట్రంలో, ఇన్ ల్యాండ్ ఫిషింగ్ కి అనువుగా ఎన్నో జల వనరులు ఉన్నాయి. కానీ, మన మత్స్యకారులకు తగిన జీవనోపాధి లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారు. మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కల్పనపై రాష్ట్ర పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొన్నారు.
Read Also: Govt Job: ప్రభుత్వ ఉద్యోగం కోసం.. తండ్రినే హతమార్చాలనుకున్న కుమారుడు! సినిమా మాదిరి స్కెచ్
Also Read
- Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
- Aman Rao Perala: ఎవరయ్యా వైభవ్ సూర్యవంశీ.? 32 బంతుల్లో సెంచరీ చేసిన హైదరాబాద్ బ్యాటర్.!
- Rare Fish: అంతర్వేదిలో అరుదైన ఫిష్.. మత్స్యకారులకు అదృష్టాన్ని తెచ్చిన 'మగ కచిడి చేప'!
- Harish Rao: ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు లాక్కోవడమా? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు
గుజరాత్, కేరళ తీరాల్లో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక జెట్టీ ఉండటంతో మత్స్యకారుల ఉపాధికి, వేటకి సౌలభ్యం ఏర్పడింది అన్నారు పవన్ కల్యాణ్. అయితే, మన రాష్ట్రంలో మాత్రం జెట్టీలు నిర్మిస్తాం.. హార్బర్లు కట్టేస్తాం అని మాటలు మాత్రమే ఈ ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యమంత్రి అధికార నివాసానికి రూ.451 కోట్లు వెచ్చించేందుకు నిధులు విడుదల చేసే ప్రభుత్వం.. మత్స్యకారులకు జెట్టీలు, హార్బర్లు నిర్మాణానికి మాత్రం ఆసక్తి చూపటం లేదని దుయ్యబట్టారు. రుషికొండపై నిర్మితమవుతున్న రాజ మహల్ కోసం చేస్తున్న ఖర్చుతో ఒక హార్బర్ నిర్మించవచ్చు. ఏడు జెట్టీలు నిర్మాణం చేయవచ్చు. ఈ ప్రభుత్వానికి మత్స్యకారుల ఉపాధి, సంక్షేమం అనేవి ప్రాధాన్యం కాదు.. రుషికొండ కొట్టేసి మహల్ నిర్మించుకోవడమే ముఖ్యం అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Telangana Elections 2023: ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ టాప్.. రాజస్థాన్ కంటే ఎక్కువ సొత్తు ఇక్కడే సీజ్
మత్స్యకారులకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలులో సైతం నిబంధనల పేరుతో కోతలు వేస్తున్నారని నిలదీశారు పవన్ కల్యాణ్.. వలలు, డీజిల్ రాయితీలపైనా జగన్ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. ఉమ్మడి ప్రభుత్వంలో.. హామీలు, శంకుస్థాపనలతో సరిపుచ్చకుండా మత్స్యకారులకు ఉపాధి కల్పనపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామన్నారు. మన మత్స్యకారులు గుజరాత్, కేరళ, మహారాష్ట్ర లాంటి చోట్లకు వలసలు వెళ్లాల్సిన అవసరం లేకుండా తీర ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం అన్నారు. తీర గ్రామాల్లో విద్య, వైద్య వసతుల మెరుగుదలపైన, మత్స్యకార కుటుంబాల్లోని మహిళలు, వృద్ధుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెడతామని తన ప్రకటనలో పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
IAF Masterstroke: రఫేల్ యుద్ధ విమానాలు సేఫ్.. ఎయిర్ఫోర్స్ రిపోర్ట్ దెబ్బకు దెయ్యం వదిలిన పాకిస్థాన్!
-
ATM Cash Van : ఏటీఎంలో డబ్బులు పెట్టాల్సినోడు.. తన జేబులో వేసుకుని జంప్.!
-
Spirit Controversy : ప్రభాస్ సినిమాను కోర్టుకు వెళ్లి ఆపిస్తా: రైతు మహిళా నిర్మాత నర్సమ్మ
-
Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
-
Rishabh Pant: ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్వాప్ డీల్! లఖ్నవూకు రిషభ్ పంత్ గుడ్ బై.. ఏ జట్టుకు మారాడో తెలుసా?
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!