Janasena Formation Day: రేపే జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. గిరిజన పల్లెలో పవన్ కళ్యాణ్ వేడుకలు.. షెడ్యూల్ ఇదే!
- పాడేరు నియోజకవర్గం, నందిగరువు గ్రామంలో పవన్ పర్యటన
- ప్రధానమంత్రి జన్ మన్ (అడవితల్లి బాట) ద్వారా నిర్మించిన రోడ్ల పరిశీలన
- నిర్మాణం పూర్తయిన రహదారుల ప్రారంభోత్సవం
- ప్రజలతో మాటా-మంతి
- గిరిపుత్రులతో కలసి మధ్యాహ్న భోజనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena Formation Day: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం (మార్చి 14) వేడుకలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులు వేడుకలకు సిద్ధమయ్యారు. అయితే, ఈ ఏడాది పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని గిరిపుత్రుల మధ్య జరుపుకోవాలని పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. రేపు (శనివారం) అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని నందిగరువు గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారు. గిరిజనుల కష్టసుఖాలను తెలుసుకుంటూనే, వారి మధ్యే పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు.
READ ALSO: Iran War: ఇరాన్ ‘‘లొంగిపోబోతోంది’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
పవన్ కళ్యాణ్ పర్యటన విశేషాలు..
తొలుత ఓనూరు జంక్షన్ వద్ద జనసేన జెండాను పవన్ కళ్యాణ్ ఆవిష్కరిస్తారు. అనంతరం ‘పీఎం జన్ మన్’ (ప్రధాన మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్) పథకం కింద నిర్మించిన రోడ్లను ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు వరకు నిర్మించిన 2.4 కి.మీ రహదారిని కాలి నడకన ప్రయాణిస్తూ పనుల నాణ్యతను తనిఖీ చేస్తారు. తర్వాత నిర్మాణం పూర్తయిన రహదారులను గిరిజనుల సమక్షంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నందిగరువు గ్రామ ప్రజలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు ‘మాటా-మంతి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పర్యటన చివరలో గిరిజనులతో కలిసి పవన్ కళ్యాణ్ మధ్యాహ్న భోజనం చేస్తారు. అధ్యక్షుడి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో జనసైనికులు సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే పార్టీ ప్రధాన లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!