KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ తాజా చిత్రం ‘జన నాయకుడు’ విడుదల ఘడియలు దగ్గరపడ్డాయి. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాబోయే జులై 23న ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 స్క్రీన్లలో అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో నిర్మాత వెంకట్ కె. నారాయణ సినిమా విశేషాలను పంచుకున్నారు. విజయ్ రాజకీయ రంగప్రవేశం తర్వాత వస్తున్న చివరి చిత్రం కావడంతో ఈ సినిమా అనేక అడ్డంకులను ఎదుర్కొంది. జనవరిలో విడుదల కావాల్సిన సినిమా ఇప్పుడు జులై 23కి వచ్చింది, మొత్తంగా చూస్తే రిలీజ్, పైరసీ, కోర్టు వ్యవహారాలు… ఇలా ఇన్ని సమస్యలు ఎదురవుతాయని మేము అసలు ఊహించలేదు. దేవుడు యుద్ధం తర్వాతే కిరీటం ఇస్తాడనే నమ్మకంతో ముందడుగు వేశాం. ముఖ్యంగా విజయ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత థియేటర్లలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఉత్సాహం నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంది. కాకపొతే ఇందులో మంచిని కూడా చూడాలంటే విజయ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా వస్తోంది, తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ గారి సినిమా థియేటర్లలో విడుదల కావడం ప్రేక్షకులకు, అభిమానులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి.” అని నిర్మాత పేర్కొన్నారు.
ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ‘భగవంత్ కేసరి’ ఛాయలు ఉన్నాయన్న ప్రచారంపై స్పందిస్తూ: “ఆ సినిమాలో గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ నేపథ్యం ఉండి, రెండు సీన్లు మాకు ఎంతగానో నచ్చాయి. అందులోని రెండు సన్నివేశాలను మాత్రమే ఇన్స్పిరేషన్గా తీసుకుని, మిగతా కథ మొత్తం కొత్త ప్రపంచంలో సాగేలా రూపొందించాం, ఇందులో గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్, సమాజంలో మార్పు తీసుకురావాలనే సందేశం ఉంది. ఆ భావనను మాత్రమే స్ఫూర్తిగా తీసుకున్నాము తప్ప, ‘జన నాయకుడు’ కథా ప్రపంచం, కాన్ఫ్లిక్ట్ పూర్తిగా కొత్తగా ఉంటుంది. దర్శకుడు అనిల్ రావిపూడి గారితో కూడా మాట్లాడాకే ఈ పాయింట్పై నిజాయితీగా వర్క్ చేశాం.” అని క్లారిటీ ఇచ్చారు. విజయ్ క్రమశిక్షణ, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం అద్భుతమని, ఆయన మేనేజర్ ద్వారా ప్రారంభమైన ఈ ప్రయాణం కేవీఎన్ బ్యానర్కు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నిర్మాత హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయ్ గారి దృష్టి అంతా ప్రజాసేవపైనే ఉన్నందున మళ్లీ సినిమాలు చేసే అవకాశం లేకపోవచ్చని, అందుకే ఈ చిత్రం ఆయన సుదీర్ఘ సినీ ప్రయాణానికి అత్యుత్తమ ట్రిబ్యూట్గా అభిమానులకు ఎప్పటికీ నిలిచిపోతుందని అన్నారు. ప్రస్తుతం విజయ్ దృష్టంతా ప్రజా సేవపైనే ఉంది, ఈ పరిస్థితుల్లో ఆయన మళ్లీ సినిమాలు చేసే అవకాశం ఉంటుందని నేను అనుకోవడం లేదు, విజయ్ సినీ ప్రయాణానికి ఓ ట్రిబ్యూట్లా ఉండేలా ప్లాన్ చేశాం, అని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారితో చేస్తున్న ప్రాజెక్ట్ చాలా అద్భుతంగా రూపుదిద్దుకుంటోందని ప్రొడ్యూసర్ వెంకట్ తెలిపారు.
Also Read
- Murali Kishor: 'లెనిన్' డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
- Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
- Amitabh Bachchan: ఐసీయూలో అమితాబ్ బచ్చన్.. అసలు ఏం జరిగిందంటే!
- Aamani : "రేపు నువ్వే హీరోయిన్" అని, కథలు వినటానికి గెస్ట్ హౌస్ లకి రమ్మని చెప్పేవారు!
తాజావార్తలు
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!