Jammu Kashmir: తీవ్ర విషాదం.. లోయలో పడిన ఆర్మీ వాహనం..10 మంది జవాన్లు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూకశ్మీర్లోని డోడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచింది. భారత సైన్యానికి చెందిన ఒక వాహనం లోయలో పడిపోవడంతో పది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది సైనికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అమరులైన వీర సైనికులకు దేశం నివాళులు అర్పిస్తోంది. డోడా జిల్లాలోని భదర్వా–చంబా అంతర్రాష్ట్ర రహదారిపై ఖన్నీ టాప్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుల్లెట్ ప్రూఫ్ సైనిక వాహనం మొత్తం 17 మంది సిబ్బందితో కలిసి ఎత్తైన ప్రాంతంలోని ఒక పోస్ట్కి వెళ్తోంది. ఈ క్రమంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అది సుమారు 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.
READ MORE: Gautam Gambhir: ‘నేను నా సొంత జట్టుతోనే పోటీ పడుతున్నా’.. వివాదంగా మారిన గౌతమ్ గంభీర్ పోస్ట్..
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ప్రమాదం జరిగిన వెంటనే సైన్యం, పోలీసులు కలిసి సహాయక చర్యలు ప్రారంభించారు. తొలుత నలుగురు సైనికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. మిగతా గాయపడిన వారిని బయటకు తీసుకొచ్చారు. తీవ్ర గాయాలైన ముగ్గురు సైనికులను హెలికాప్టర్ ద్వారా ఉదంపూర్ సైనిక ఆసుపత్రికి తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ మరికొందరు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య పది మందికి చేరింది. ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. “డోడాలో జరిగిన ఈ దురదృష్టకర ప్రమాదంలో పది మంది మా వీర సైనికులను కోల్పోయాం. వారి సేవలు, త్యాగాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి” అని పేర్కొంది.
READ MORE: Bhojshala Complex: భోజశాల మందిరామా, మసీదా..? ఒకప్పటి సంస్కృత విద్యా కేంద్రం, నేడు వివాదం..
గత ఏడాది మే నెలలో కూడా రాంబన్ జిల్లాలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. జమ్మూ నుంచి శ్రీనగర్కు వెళ్తున్న సైనిక కాన్వాయ్లోని ఒక ట్రక్ అదుపు తప్పి సుమారు 700 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఆ ప్రమాదంలో అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మాన్ బహదూర్ అనే ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు సరిహద్దు ప్రాంతాల్లో సైనికులు ఎదుర్కొనే కష్టాలను మరోసారి గుర్తు చేస్తున్నాయి. కఠిన భౌగోళిక పరిస్థితులు, ప్రమాదకర రహదారుల మధ్య దేశ భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న సైనికుల త్యాగానికి దేశం శిరసు వంచి నమస్కరిస్తోంది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!