Jairam Ramesh: అక్టోబర్ 24 నుండి తెలంగాణలో రాహుల్ యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అనూహ్య స్పందన వస్తోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. తెలంగాణలో రాహుల్ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్, ఇతర విషయాల గురించి దిగ్విజయ్ సింగ్ తో కలిసి బోయిన్ పల్లిలో ఆయన చర్చించారు. రాహుల్ గాంధీ ఇవాళ..రేపు దసరా సందర్బంగా బ్రేక్ ఇచ్చారు. ఎల్లుండి భారత్ జోడో యాత్ర యథావిధిగా మొదలవుతుంది. కర్ణాటక లో 11 కిలోమీటర్లు పూర్తి అయింది. 95 కిలోమీటర్లు ఆంధ్రలో ఉంటుంది ..నాలుగు రోజులు యాత్ర అక్కడ వుంటుందన్నారు జైరాం రమేష్.
మన్ కీ బాత్ యాత్ర కాదు.. జోడో యాత్ర లిసనింగ్ యాత్ర. జనతాకి చింతా.. మోడీ నే సర్వ జ్ఞాపి.. సర్వ వ్యాపి.. రాజ్యాంగం అమలు లేదు.. వ్యవస్థలు లేవు. రాహుల్ గాంధీ పాదయాత్రకి కర్ణాటక లో మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు జైరాం రమేష్. జోడో యాత్ర ఎఫెక్ట్ RSS మీద పడిందన్నారు. ముస్లిం పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు. పేదరికంపై, అసమానతలపై మాట్లాడుతున్నారు. దేశంలో ఎక్కడైనా ఇప్పుడు భారత్ జొడో గురించే చర్చ జరుగుతుంది.
Also Read
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
- Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
- IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
Read ALso: Vasuki: పవన్ కళ్యాణ్ చెల్లెలు రీ ఎంట్రీ.. 24 ఏళ్ల తరువాత ఎలా ఉందో చూడండి
తెలంగాణ ప్రజలు బయటకు రండి. బీజేపీ కి బలమైన సంకేతం ఇవ్వండి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకే కాదు టీఆర్ఎస్ కి కూడా గుణపాఠం చెప్పాలన్నారు. తెలంగాణలో 375 కిలోమీటర్లు, 13 రోజులు పాదయాత్ర ఉంటుందన్నారు. కాంగ్రెస్ pds డిస్ట్రిబ్యూట్ చేసింది.. కానీ trs లిక్కర్ పంపిణీ చేస్తుంది. గంట క్రితం ఫోటో చూశా.. బీజేపీ డబుల్ ఇంజన్ అంటే… ఒకటి బీజేపీ..రెండోది టీఆర్ఎస్ అని ఎద్దేవా చేశారు జైరాం రమేష్.
బీజేపీ, టీఆర్ఎస్ నాణేనికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళే. TRS కి BRS సమయం కాదు సీఎం కేసీఆర్ కి అది VRS అని సెటైర్లు వేశారు జైరాం రమేష్. ఢిల్లీలో సుల్తాన్… తెలంగాణలో నిజాం అన్నారాయన. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. పెద్ద వాళ్ళకే బీజేపీ అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. నోట్ల రద్దు నుంచి అదే వ్యవహారం నడుస్తోందన్నారు. పేదలు అలాగే ఉండి పోతున్నారు.. రాహుల్ గాంధీ అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడుతున్నారన్నారు దిగ్విజయ్ సింగ్. దేశంలో అశాంతి పెరిగింది. అశాంతితో దేశం అభివృద్ధి చెందదు. రాహుల్ గాంధీ పై బీజేపీ నేతలు దుష్ప్రచారం చేశారు. కానీ కన్యాకుమారి నుండి రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలు పెట్టారు. తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ని విజయవంతం చేయాలని దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు.
ఢిల్లీలో అయితే బీజేపీ… లేదంటే కాంగ్రెస్సే.. బీజేపీ ఈడీ, సీబీఐలను వాడుతుంది. రాహుల్..సోనియా గాంధీలను కూడా పిలిచింది. నేషనల్ హెరాల్డ్ నుండి రూపాయి కూడా రాహుల్ గాంధీ ఖాతాలోకి రాలేదు. నేషనల్ హెరాల్డ్ కి మా నాయకులు చందా ఇచ్చినా ఈడీకి ఇబ్బంది అవుతుందన్నారు దిగ్విజయ్ సింగ్. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక పారదర్శకంగా జరుగుతుంది. బార్ కోడ్ తో కూడిన ఓటర్ కార్డ్ ఏ పార్టీలో అయినా ఉంటుందా..? అన్నారు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్.
Read Also: Doctors Molested Woman: దారుణం.. కలవాలని పిలిచి మహిళపై డాక్టర్లు అత్యాచారం
తాజావార్తలు
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
-
Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
-
Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో ‘లగ్జరీ’ ఫోన్.. రేపు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!