సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని బేగంపేటలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తూ ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో రజనీకాంత్తో పాటు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, మాలీవుడ్ లెజెండ్ మోహన్ లాల్, మరియు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్కుమార్ కలిసి ఒకే సన్నివేశంలో కనిపించబోతున్నారు. భారతీయ సినీ చరిత్రలో ఇంతమంది అగ్ర తారలు ఒకే స్క్రీన్పై కనిపించడం ఇదే మొదటిసారి కానుంది.
Also Read : Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్కి సవాల్ గా మారిన ‘LIK’ !
ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నారు. ఇందుకోసం ఆయన ఐదు రోజుల పాటు హైదరాబాద్ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. మొదటి భాగంలో మోహన్ లాల్, శివ రాజ్కుమార్ పాత్రలు క్లైమాక్స్లో ఇచ్చిన హై ఇప్పుడు షారుఖ్ తోడవ్వడంతో మరో లెవల్కు వెళ్లనుంది. అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో, ఈ సినిమాను ఆగస్టు 2026 స్వాతంత్య్ర దినోత్సవ వీకెండ్లో విడుదల చేసేందుకు మేకర్స్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నలుగురు దిగ్గజాలను ఒకేసారి వెండితెరపై చూసేందుకు అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
