Site icon NTV Telugu

Jai Hanuman : హనుమాన్ సీక్వెల్‌ లో ఆస్కార్ విన్నర్‌తో.. ప్రశాంత్ వర్మ భారీ స్కెచ్!

Jaihanuman

Jaihanuman

ప్రశాంత్ వర్మ సృష్టించిన ‘హను-మాన్’ మేజిక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న ‘జై హనుమాన్’ విషయంలో ప్రశాంత్ వర్మ అడుగులు చాలా పవర్‌ఫుల్‌గా పడుతున్నాయి. తాజాగా అంజనాద్రి బెట్టలో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా ఈ సీక్వెల్ కోసం జరిగిన ఒక భారీ మార్పు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : Vijay- Rashmika : అవును.. మేం పెళ్లి చేసుకుంటున్నాం.. ‘విరోష్’ వెడ్డింగ్‌పై విజయ్-రష్మిక అఫీషియల్ పోస్ట్!

ఎంటది అంటే.. మొదటి భాగంలో యువ సంగీత దర్శకుడు గౌర హరి తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. అయితే సీక్వెల్ కోసం ప్రశాంత్ వర్మ ఏకంగా ఆస్కార్ విజేత, సంగీత దిగ్గజం ఎం ఎం కీరవాణిని రంగంలోకి దించారు. ఈ విషయాన్ని హనుమంతుడిగా నటిస్తున్న రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా పోస్ట్‌లో కన్ఫర్మ్ చేశారు. రాజమౌళి సినిమాలకు తన సంగీతంతో ప్రాణం పోసే కీరవాణి, ఇప్పుడు ఈ మైథాలజీ యాక్షన్ ఎపిక్ కోసం ఎలాంటి ట్యూన్స్ ఇస్తారో అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఉన్నారు.

అంతేకాదు, ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను కూడా టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకోవడం విశేషం. రిషబ్ శెట్టి హనుమంతుడిగా, తేజ సజ్జా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం.. కీరవాణి రాకతో మరింత ‘పాన్ వరల్డ్’ అప్పీల్‌ను సొంతం చేసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే, ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ను కేవలం సినిమాగా కాకుండా ఒక విజువల్ అండ్ మ్యూజికల్ ట్రీట్‌గా ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

Exit mobile version