Jagga Reddy: కులం పేరు చెప్పుకుని రాలేదు.. జనం మధ్య నుంచే వచ్చా: జగ్గారెడ్డి
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
- వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదు
- మరలా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని, మరలా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. పాలనా పరంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఏనాడూ సచివాలయానికి రాలేదని, కేవలం వారి ఇళ్ల నుంచే పరిపాలన కొనసాగించారని విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు.
సదాశివ పేట పట్టణంలోని కందకం రోడ్డు పనులపై ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులతో జగ్గారెడ్డి సమీక్ష నిర్వహించారు. ‘సదాశివ పేట పట్టణంలోని కందకం రోడ్డుకు నేను ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ మంత్రి మహీధర్ రెడ్డిల సహకారంతో 2014లో రూ.20 కోట్లు మంజూరు చేయించా. 2014లో నిధులు మంజురైతే 11 ఏళ్ల పాటు ఎందుకు పనులు పూర్తి చేయలేక పోయారు. 11 ఏళ్ల తర్వాత మళ్లీ నేనే రివ్యూ చేయాల్సి వస్తుందంటే.. సదాశివ పేట ప్రజలు ఆలోచించాలి. ఉమ్మడి రాష్ట్రంలో 20 కోట్లు మంజూరైతే..11 సంవత్సరాలలో 15 కోట్లు ఖర్చు చేశారు. పనులు ఇప్పటికీ పూర్తి చేయలేక పోయారు. ఇంకా 5 కోట్లు పనులు మిగిలి ఉన్నాయి’ అని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.
Also Read
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్పై ఐసీసీ చర్యలు తప్పవు?
- IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
Also Read: Gautam Gambhir: నా జీవితాంతం ఆ టెస్టు సిరీస్ ఓటమిని మర్చిపోలేను!
‘నా రివ్యులకు వచ్చే అధికారులు భయపడాల్సిన అవసరం లేదు. మీపై ఆఫీసర్లు ఎవరైనా ఏమైనా అంటే నా పేరు చెప్పిండి. గెలుపు, ఓటమి నన్ను ప్రభావితం చేయలేవు. నా రాజకీయ ప్రయాణం కష్టాలతో కూడుకున్నది. రాత్రుళ్లు జెండాలు కట్టి.. పగటి పూట ధర్నాలు చేసి ఎదిగిన చరిత్ర నాది. నేను కులం పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదు.. జనం మధ్య నుంచే వచ్చాను’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్కు గుడ్బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క