Gautam Gambhir: నా జీవితాంతం ఆ టెస్టు సిరీస్ ఓటమిని మర్చిపోలేను!
- టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ సక్సెస్
- ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2025 విజయాలు
- నా జీవితాంతం ఆ టెస్టు సిరీస్ ఓటమిని మర్చిపోలేను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా హెడ్ కోచ్గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. గంభీర్ హెడ్ కోచ్గా నియమితుడయ్యాక ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2025లను భారత జట్టు గెలుచుకుంది. కుర్రాళ్లతో కూడిన జట్టుతో ఇంగ్లాండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ను సైతం డ్రాగా ముగించాడు. అయితే కోచ్గా వచ్చిన కొత్తలో గౌతీ వరుస పరాజయాలు చవిచూశాడు. అందులో ముఖ్యమైంది ఏంటంటే… భారత గడ్డపై న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ను ఓడిపోవడం. ఈ సిరీస్ ఫలితంపై గంభీర్ తాజాగా స్పందించాడు. తన జీవితాంతం న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఓటమిని మర్చిపోలేను అని చెప్పాడు.
ఢిల్లీలో వెస్టిండీస్తో రెండో టెస్టు సందర్భంగా కామెంటేటర్ ఆకాశ్ చోప్రాతో గౌతమ్ గంభీర్ ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఓటమిని నా జీవితాంతం మర్చిపోలేను. ఇదే విషయాన్ని భారత జట్టు కుర్రాళ్లకూ చెప్పాను. ఆ ఓటమిని వదిలేసి ముందుకు సాగాలి. అయితే గతాన్ని కూడా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. గతాన్ని మర్చిపోతే.. దేనినైనా తేలికగా తీసుకొనే అవకాశం ఉంటుంది. ఆటలో గెలుపు, ఓటమీ సహజమే. నేను డ్రెస్సింగ్ రూమ్లో భారత ఆటగాళ్లకు ఎప్పుడూ న్యూజిలాండ్ టెస్టు సిరీస్లో ఏం జరిగిందో వివరిస్తుంటా. ప్రత్యర్థికి అస్సలు అవకాశం ఇవ్వకూడదదని నేను అనుకుంటా’ అని గంభీర్ తెలిపాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్లు ఇవే..
- Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
- Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
Also Read: Sai Sudharsan Catch: సాయి సుదర్శన్ సూపర్ క్యాచ్.. దెబ్బ గట్టిగా తాకినా వదలలేదు!
‘ప్రపంచంలోనే నంబర్ 1 జట్టుగా మారాలనుకుంటే స్వదేశంలో గెలిస్తే చాలదు. విదేశాల్లోనూ విజయాలు సాదించాలి. ప్రస్తుతం ఉన్న యువ జట్టు అదే చేస్తోంది. ఇంగ్లాండ్ అత్యంత కఠినమైన సవాల్ విసిరే టీమ్. అందులోనూ వారి సొంతగడ్డపై అత్యంత ప్రమాదకారి. ఇంగ్లాండ్కు పెద్దగా అనుభవం లేని జట్టుతో వెళ్లాం. మన ప్లేయర్స్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. కేవలం ఫలితం మాత్రమే చూడకూడదు, ఎలాంటి పోరాటం చేశామనేది కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే స్వదేశంలో గెలిస్తే చాలదు. కేవలం మన దగ్గరే విజయాలు సాధిస్తే ఛాంపియన్షిప్ విజేతగా నిలవలేం’ అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్లు ఇవే..
-
Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
-
Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
-
RCB vs GT Final: ఆర్సీబీకి 5వ ఫైనల్.. గుజరాత్కు 3వ ఛాన్స్.. తొలి కప్పు కొట్టిన ఆ స్టేడియంలోనే రెండో టైటిల్ కోసం పోరాటం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..