Gautam Gambhir: నా జీవితాంతం ఆ టెస్టు సిరీస్ ఓటమిని మర్చిపోలేను!
- టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ సక్సెస్
- ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2025 విజయాలు
- నా జీవితాంతం ఆ టెస్టు సిరీస్ ఓటమిని మర్చిపోలేను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా హెడ్ కోచ్గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. గంభీర్ హెడ్ కోచ్గా నియమితుడయ్యాక ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2025లను భారత జట్టు గెలుచుకుంది. కుర్రాళ్లతో కూడిన జట్టుతో ఇంగ్లాండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ను సైతం డ్రాగా ముగించాడు. అయితే కోచ్గా వచ్చిన కొత్తలో గౌతీ వరుస పరాజయాలు చవిచూశాడు. అందులో ముఖ్యమైంది ఏంటంటే… భారత గడ్డపై న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ను ఓడిపోవడం. ఈ సిరీస్ ఫలితంపై గంభీర్ తాజాగా స్పందించాడు. తన జీవితాంతం న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఓటమిని మర్చిపోలేను అని చెప్పాడు.
ఢిల్లీలో వెస్టిండీస్తో రెండో టెస్టు సందర్భంగా కామెంటేటర్ ఆకాశ్ చోప్రాతో గౌతమ్ గంభీర్ ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఓటమిని నా జీవితాంతం మర్చిపోలేను. ఇదే విషయాన్ని భారత జట్టు కుర్రాళ్లకూ చెప్పాను. ఆ ఓటమిని వదిలేసి ముందుకు సాగాలి. అయితే గతాన్ని కూడా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. గతాన్ని మర్చిపోతే.. దేనినైనా తేలికగా తీసుకొనే అవకాశం ఉంటుంది. ఆటలో గెలుపు, ఓటమీ సహజమే. నేను డ్రెస్సింగ్ రూమ్లో భారత ఆటగాళ్లకు ఎప్పుడూ న్యూజిలాండ్ టెస్టు సిరీస్లో ఏం జరిగిందో వివరిస్తుంటా. ప్రత్యర్థికి అస్సలు అవకాశం ఇవ్వకూడదదని నేను అనుకుంటా’ అని గంభీర్ తెలిపాడు.
Also Read
Also Read: Sai Sudharsan Catch: సాయి సుదర్శన్ సూపర్ క్యాచ్.. దెబ్బ గట్టిగా తాకినా వదలలేదు!
‘ప్రపంచంలోనే నంబర్ 1 జట్టుగా మారాలనుకుంటే స్వదేశంలో గెలిస్తే చాలదు. విదేశాల్లోనూ విజయాలు సాదించాలి. ప్రస్తుతం ఉన్న యువ జట్టు అదే చేస్తోంది. ఇంగ్లాండ్ అత్యంత కఠినమైన సవాల్ విసిరే టీమ్. అందులోనూ వారి సొంతగడ్డపై అత్యంత ప్రమాదకారి. ఇంగ్లాండ్కు పెద్దగా అనుభవం లేని జట్టుతో వెళ్లాం. మన ప్లేయర్స్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. కేవలం ఫలితం మాత్రమే చూడకూడదు, ఎలాంటి పోరాటం చేశామనేది కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే స్వదేశంలో గెలిస్తే చాలదు. కేవలం మన దగ్గరే విజయాలు సాధిస్తే ఛాంపియన్షిప్ విజేతగా నిలవలేం’ అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
-
Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
-
Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
-
CM Chandrababu : భారత్ పారిశ్రామిక వృద్ధిలో సీఐఐ పాత్ర కీలకం
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?