Madhyapradesh : జైలు నుంచి వచ్చి.. లవర్ కుటుంబాన్ని నరికి ఫ్రిజ్ లో పెట్టాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన జంట హత్యలు సంచలనం సృష్టించాయి. ఇక్కడ పొరుగున నివసిస్తున్న ఓ యువకుడు రైల్వే ఉద్యోగిని, అతని ఎనిమిదేళ్ల కొడుకును దారుణంగా హత్య చేశాడు ఓ కిరాతకుడు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఫ్రిజ్, బాక్స్లో దాచారు. నేరం చేసిన తర్వాత నిందితుడు మృతుడి మైనర్ కుమార్తెను కిడ్నాప్ చేసి పారిపోయాడు. అనంతరం మృతుడి.. కుమార్తె మొబైల్ ఫోన్ నుంచి వాయిస్ మెసేజ్ ద్వారా జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశాడు.
Read Also:YSRCP Final Candidates List: నేడు వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇడుపులపాయలో ఏర్పాట్లు
Also Read
- Aman Rao Perala: ఎవరయ్యా వైభవ్ సూర్యవంశీ.? 32 బంతుల్లో సెంచరీ చేసిన హైదరాబాద్ బ్యాటర్.!
- Rare Fish: అంతర్వేదిలో అరుదైన ఫిష్.. మత్స్యకారులకు అదృష్టాన్ని తెచ్చిన 'మగ కచిడి చేప'!
- Harish Rao: ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు లాక్కోవడమా? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు
- GEN Z పిల్లలు Vaibhav Sooryavanshiని చూసి నేర్చుకోండి.. వైభవ్పై ప్రధాని మోడీ ప్రశంసలు.!
జబల్పూర్లోని సివిల్లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిలీనియం కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ పోలీసులు మూసి ఉన్న ఇంట్లో రెండు మృతదేహాలను గుర్తించారు. ఒక మృతదేహం రైల్వేలో పనిచేసిన 52 ఏళ్ల రాజ్కుమార్ విశ్వకర్మది కాగా, మరొకటి అతని 8 ఏళ్ల కుమారుడిది. కుమారుడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో, పెట్టెలో ఉంచారు. మృతుడు రాజ్కుమార్ విశ్వకర్మ మేనకోడలు మొబైల్ ఫోన్లో మెసేజ్ వచ్చిందని జబల్పూర్ పోలీసులకు సమాచారం అందించింది. ఈ సందేశం రాజ్కుమార్ విశ్వకర్మ కుమార్తె నంబర్ నుండి పంపబడింది. నేనే ముకుల్ సింగ్ అని మెసేజ్ లో రాసి ఉంది. నేను రాజ్ కుమార్ విశ్వకర్మను, అతని కొడుకును చంపాను. వారిద్దరి మృతదేహాలు ఇంట్లో పడి ఉన్నాయి. ఈ మెసేజ్ అందుకున్న రాజ్కుమార్ కుటుంబ సభ్యులు జబల్పూర్కు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. జబల్పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తాళం వేసి ఉన్న ఇంటిని తెరిచి చూడగా ఇక్కడ తండ్రీకొడుకుల మృతదేహాలు కనిపించాయి.
Read Also:PM Modi: నేడు నాగర్కర్నూల్కు మోడీ.. బహిరంగ సభ
ఈ విషయమై జబల్పూర్ ఎస్పీ షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈ ఘటనలో ముకుల్ సింగ్ అనే వ్యక్తి గతంలో కూడా ఈ బాలికను వేధించాడని జబల్పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. పోక్సో చట్టం కింద అతడికి జైలు శిక్ష కూడా పడింది. ఇటీవల జైలు నుంచి విడుదలైన అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం బాధిత బాలిక ముకుల్ సింగ్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హంతకుడు ఆ అమాయకపు చిన్నారిని కిడ్నాప్ చేశాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు బాలికను సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సంఘటనపై ఫోరెన్సిక్ దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పోస్టుమార్టం తర్వాత వీరిద్దరూ ఎన్ని రోజుల క్రితం హత్యకు గురయ్యారో తేలిపోనుంది. బాధిత బాలిక తండ్రి, సోదరుడిని హత్య చేసిన ముకుల్ సింగ్ గురించి పోలీసులకు ఇంకా ఎలాంటి సమాచారం లేదు.
తాజావార్తలు
-
Rishabh Pant: ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్వాప్ డీల్! లఖ్నవూకు రిషభ్ పంత్ గుడ్ బై.. ఏ జట్టుకు మారాడో తెలుసా?
-
Peddi: అనాథ పిల్లలకు రామ్ చరణ్ ఊహించని గిఫ్ట్
-
Nara Rohith : వారసుడొచ్చాడు.. తండ్రయిన నారా రోహిత్!
-
2027 Sankranthi : టాలీవుడ్ సీనియర్స్ వర్సెస్ కోలీవుడ్ స్టార్స్!
-
Sunil Gavaskar-BCCI: ఎవడుపడితే వాడు జట్టులోకి వస్తుండు.. బీసీసీఐపై సునీల్ గవాస్కర్ ఫైర్!
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!