Madhyapradesh : జైలు నుంచి వచ్చి.. లవర్ కుటుంబాన్ని నరికి ఫ్రిజ్ లో పెట్టాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన జంట హత్యలు సంచలనం సృష్టించాయి. ఇక్కడ పొరుగున నివసిస్తున్న ఓ యువకుడు రైల్వే ఉద్యోగిని, అతని ఎనిమిదేళ్ల కొడుకును దారుణంగా హత్య చేశాడు ఓ కిరాతకుడు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఫ్రిజ్, బాక్స్లో దాచారు. నేరం చేసిన తర్వాత నిందితుడు మృతుడి మైనర్ కుమార్తెను కిడ్నాప్ చేసి పారిపోయాడు. అనంతరం మృతుడి.. కుమార్తె మొబైల్ ఫోన్ నుంచి వాయిస్ మెసేజ్ ద్వారా జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశాడు.
Read Also:YSRCP Final Candidates List: నేడు వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇడుపులపాయలో ఏర్పాట్లు
Also Read
- DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
- Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
- Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్కు NIA సమన్లు
- AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
జబల్పూర్లోని సివిల్లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిలీనియం కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ పోలీసులు మూసి ఉన్న ఇంట్లో రెండు మృతదేహాలను గుర్తించారు. ఒక మృతదేహం రైల్వేలో పనిచేసిన 52 ఏళ్ల రాజ్కుమార్ విశ్వకర్మది కాగా, మరొకటి అతని 8 ఏళ్ల కుమారుడిది. కుమారుడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో, పెట్టెలో ఉంచారు. మృతుడు రాజ్కుమార్ విశ్వకర్మ మేనకోడలు మొబైల్ ఫోన్లో మెసేజ్ వచ్చిందని జబల్పూర్ పోలీసులకు సమాచారం అందించింది. ఈ సందేశం రాజ్కుమార్ విశ్వకర్మ కుమార్తె నంబర్ నుండి పంపబడింది. నేనే ముకుల్ సింగ్ అని మెసేజ్ లో రాసి ఉంది. నేను రాజ్ కుమార్ విశ్వకర్మను, అతని కొడుకును చంపాను. వారిద్దరి మృతదేహాలు ఇంట్లో పడి ఉన్నాయి. ఈ మెసేజ్ అందుకున్న రాజ్కుమార్ కుటుంబ సభ్యులు జబల్పూర్కు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. జబల్పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తాళం వేసి ఉన్న ఇంటిని తెరిచి చూడగా ఇక్కడ తండ్రీకొడుకుల మృతదేహాలు కనిపించాయి.
Read Also:PM Modi: నేడు నాగర్కర్నూల్కు మోడీ.. బహిరంగ సభ
ఈ విషయమై జబల్పూర్ ఎస్పీ షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈ ఘటనలో ముకుల్ సింగ్ అనే వ్యక్తి గతంలో కూడా ఈ బాలికను వేధించాడని జబల్పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. పోక్సో చట్టం కింద అతడికి జైలు శిక్ష కూడా పడింది. ఇటీవల జైలు నుంచి విడుదలైన అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం బాధిత బాలిక ముకుల్ సింగ్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హంతకుడు ఆ అమాయకపు చిన్నారిని కిడ్నాప్ చేశాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు బాలికను సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సంఘటనపై ఫోరెన్సిక్ దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పోస్టుమార్టం తర్వాత వీరిద్దరూ ఎన్ని రోజుల క్రితం హత్యకు గురయ్యారో తేలిపోనుంది. బాధిత బాలిక తండ్రి, సోదరుడిని హత్య చేసిన ముకుల్ సింగ్ గురించి పోలీసులకు ఇంకా ఎలాంటి సమాచారం లేదు.
తాజావార్తలు
-
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్కు NIA సమన్లు
-
AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!