Madhyapradesh : జైలు నుంచి వచ్చి.. లవర్ కుటుంబాన్ని నరికి ఫ్రిజ్ లో పెట్టాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన జంట హత్యలు సంచలనం సృష్టించాయి. ఇక్కడ పొరుగున నివసిస్తున్న ఓ యువకుడు రైల్వే ఉద్యోగిని, అతని ఎనిమిదేళ్ల కొడుకును దారుణంగా హత్య చేశాడు ఓ కిరాతకుడు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఫ్రిజ్, బాక్స్లో దాచారు. నేరం చేసిన తర్వాత నిందితుడు మృతుడి మైనర్ కుమార్తెను కిడ్నాప్ చేసి పారిపోయాడు. అనంతరం మృతుడి.. కుమార్తె మొబైల్ ఫోన్ నుంచి వాయిస్ మెసేజ్ ద్వారా జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశాడు.
Read Also:YSRCP Final Candidates List: నేడు వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇడుపులపాయలో ఏర్పాట్లు
Also Read
- CI Suspended: ఆరోపణలు నిజమే.. సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్..!
- NEET-UG 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం.. 13 మందిపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు.!
- Hyderabad: మియాపూర్లో విషాదం..! ఓపెన్ మ్యాన్హోల్లో పడి వ్యక్తి గల్లంతు.!
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
జబల్పూర్లోని సివిల్లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిలీనియం కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ పోలీసులు మూసి ఉన్న ఇంట్లో రెండు మృతదేహాలను గుర్తించారు. ఒక మృతదేహం రైల్వేలో పనిచేసిన 52 ఏళ్ల రాజ్కుమార్ విశ్వకర్మది కాగా, మరొకటి అతని 8 ఏళ్ల కుమారుడిది. కుమారుడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో, పెట్టెలో ఉంచారు. మృతుడు రాజ్కుమార్ విశ్వకర్మ మేనకోడలు మొబైల్ ఫోన్లో మెసేజ్ వచ్చిందని జబల్పూర్ పోలీసులకు సమాచారం అందించింది. ఈ సందేశం రాజ్కుమార్ విశ్వకర్మ కుమార్తె నంబర్ నుండి పంపబడింది. నేనే ముకుల్ సింగ్ అని మెసేజ్ లో రాసి ఉంది. నేను రాజ్ కుమార్ విశ్వకర్మను, అతని కొడుకును చంపాను. వారిద్దరి మృతదేహాలు ఇంట్లో పడి ఉన్నాయి. ఈ మెసేజ్ అందుకున్న రాజ్కుమార్ కుటుంబ సభ్యులు జబల్పూర్కు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. జబల్పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తాళం వేసి ఉన్న ఇంటిని తెరిచి చూడగా ఇక్కడ తండ్రీకొడుకుల మృతదేహాలు కనిపించాయి.
Read Also:PM Modi: నేడు నాగర్కర్నూల్కు మోడీ.. బహిరంగ సభ
ఈ విషయమై జబల్పూర్ ఎస్పీ షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈ ఘటనలో ముకుల్ సింగ్ అనే వ్యక్తి గతంలో కూడా ఈ బాలికను వేధించాడని జబల్పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. పోక్సో చట్టం కింద అతడికి జైలు శిక్ష కూడా పడింది. ఇటీవల జైలు నుంచి విడుదలైన అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం బాధిత బాలిక ముకుల్ సింగ్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హంతకుడు ఆ అమాయకపు చిన్నారిని కిడ్నాప్ చేశాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు బాలికను సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సంఘటనపై ఫోరెన్సిక్ దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పోస్టుమార్టం తర్వాత వీరిద్దరూ ఎన్ని రోజుల క్రితం హత్యకు గురయ్యారో తేలిపోనుంది. బాధిత బాలిక తండ్రి, సోదరుడిని హత్య చేసిన ముకుల్ సింగ్ గురించి పోలీసులకు ఇంకా ఎలాంటి సమాచారం లేదు.
తాజావార్తలు
-
CI Suspended: ఆరోపణలు నిజమే.. సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్..!
-
Ramayana: ట్రైలర్కు ముందే ‘పుష్ప’ రికార్డ్ బద్దలు.. ‘రామాయణం’ మ్యూజిక్ రైట్స్కు రూ.75 కోట్ల డీల్!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు.. అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు!
-
NEET-UG 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం.. 13 మందిపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు.!
-
Hyderabad: మియాపూర్లో విషాదం..! ఓపెన్ మ్యాన్హోల్లో పడి వ్యక్తి గల్లంతు.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!