Income Tax Return: దేశంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను దాఖలుకు గడువు 31 జూలై 2023తో ముగిసింది మరియు దానికి సంబంధించిన డేటా నుండి ఇప్పుడు అనేక వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దేశంలో కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య వేగంగా పెరిగిందని ఈ ఏడాది ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ డేటా వెల్లడించింది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేసినవారిలో కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2.69 లక్షలు. కోవిడ్ సంక్షోభానికి ముందు 2018-19 సంవత్సరంతో పోలిస్తే ఇది 49.4 శాతం ఎక్కువ. ఈ విధంగా గత 4 ఏళ్లలో అధికారికంగా రూ.1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి సంఖ్య దాదాపు 50 శాతం పెరగడం దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడానికి సంకేతంగా భావించవచ్చు.
Read Also:Tomoto Van: బోల్తాపడ్డ టమాటా వ్యాన్.. దోపిడీకి దిగిన ప్రజలు
2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2.69 లక్షలుగా ఉందని ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఇ-ఫైలింగ్ డేటా చెబుతోంది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1.93 లక్షలు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇది 1.80 లక్షలుగా ఉంది. 2019-20 సంవత్సరంతో పోలిస్తే కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లించే పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పరిశీలిస్తే, అందులో 41.5 శాతం పెరుగుదల కనిపించింది. మరోవైపు ఈ కాలంతో పోలిస్తే రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య కేవలం 0.6 శాతం మాత్రమే పెరిగింది.
అదేవిధంగా రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య 1.4 శాతం పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల పన్ను పరిధిలో 1.10 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. ఒక్కో పన్ను శ్లాబులో పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పరిశీలిస్తే, 4.65 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయాన్ని చూపారు.. అంటే వీరు కట్టే పన్ను జీరో అన్న మాట.
– రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల పన్ను పరిధిలో 1.10 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు.
– 10 లక్షల నుంచి 20 లక్షల మధ్య ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య 45 లక్షలు.
– 20 నుంచి 50 లక్షల మధ్య పన్ను చెల్లింపుదారుల సంఖ్య 19 లక్షలు.
– 50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య 3.3 లక్షలు.