Israel: గాజాలో ముగ్గురు బందీల మృతదేహాల స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్ సృష్టించిన ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెలీయులను బందీలుగా తీసుకెళ్లిన ఓ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఇజ్రాయెల్ మహిళా సైనికుల పట్ల క్రూరత్వం ప్రదర్శించినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలో ముగ్గురు బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకుంది.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: ప్రశాంత్ కిషోర్కి బీజేపీ నిధులు.. ఎన్నికల వ్యూహమని తేజస్వీ ఆరోపణలు..
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
అక్టోబరు 7న హమాస్ నేతృత్వంలోని మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెలీయులు మరణించారు. వారికి సంబంధించిన మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. గాజా నుంచి హనాన్ యబ్లోంకా, మిచెల్ నిసెన్బామ్, ఓరియన్ హెర్నాండెజ్ రాడౌక్స్తో సహా ముగ్గురు బందీల మృతదేహాలను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది. గాజా స్ట్రిప్లో స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం తెలిపింది. ఇంటెలిజెన్స్ సర్వీసెస్ సంయుక్త ఆపరేషన్లో హనన్ యబ్లోంకా, మిచెల్ నిసెన్బామ్ మరియు ఓరియన్ హెర్నాండెజ్ రాడౌక్స్ మృతదేహాలను రాత్రిపూట స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. మిలిటరీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ గాజాలో ఇంకా మిగిలి ఉన్న బందీలను వెనక్కి తీసుకురావాలని ఇజ్రాయెల్ నిర్ణయించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Yakshini: సోషియో ఫాంటసీ ‘యక్షిణి’.. వణికిస్తున్న ట్రైలర్!
అక్టోబర్ 7న హమాస్ దాడి చేసి దాదాపు 250 మంది ఇజ్రాయెలీయులు, విదేశీయులను బందీలుగా తీసుకుపోయింది. అనంతరం ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. హమాస్ లక్ష్యంగా దాడులు చేసింది. వందలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని నెలలుగా హమాస్ టార్గెట్గా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే నవంబర్లో 130 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. మిగతా వారి సంగతి మాత్రం ఇంకా తెలియలేదు. వారు క్షేమంగా ఉన్నారా? లేదంటే చనిపోయారా? అన్న సంగతి మాత్రం తెలియలేదు. మరోవైపు యుద్ధానికి ముగింపు కోసం చర్చలు నడుస్తున్నా.. సఫలీకృతం కావడం లేదు.
ఇది కూడా చదవండి: CS Shantha Kumari: రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..