Iran Nuclear Site: ఇజ్రాయెల్ కౌంటర్ దాడులతో ఇరాన్ అణు కేంద్రాల గుండె బద్దలైందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Nuclear Site: ఇజ్రాయెల్ చేపట్టిన “ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరిట నిర్వహించిన వైమానిక దాడుల తర్వాత, ఇరాన్ అణుశక్తి కేంద్రాల్లో సంభవించిన నష్టాన్ని స్పష్టంగా చూపించే ఉపగ్రహ చిత్రాలను మాక్సార్ టెక్నాలజీస్ విడుదల చేసింది. ఈ చిత్రాలలో నాటాంజ్, ఫోర్డో ఇంకా ఇస్ఫహాన్ ప్రాంతాల్లోని కీలక అణు కేంద్రాలపై జరిగిన దాడుల ముందు, తర్వాత పరిస్థితుల తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడులలో నాటాంజ్ అణు కేంద్రం పైభాగంలోని కీలక నిర్మాణాలు ధ్వంసమయ్యాయని, అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) పేర్కొంది. విద్యుత్ సరఫరా సదుపాయాలకు పెద్దెత్తున నష్టం వాటిల్లిందని ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ (ISIS) పేర్కొంది. విద్యుత్ లేమితో కేంద్రాల లోపల ఉన్న సెంట్రిఫ్యూజ్లు (యురేనియం శుద్ధికరణ యంత్రాలు) తీవ్రమైన నష్టాన్ని పొందవచ్చని పేర్కొంది.
Read Also: Asaduddin Owaisi: మోడీ, చంద్రబాబు, పవన్పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..!
Also Read
- Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
- Ramani Kalyanam : వీల్చైర్లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- 48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
నాటాంజ్ అణు కేంద్రం తెహరాన్కు దక్షిణాన 220 కి.మీ. దూరంలో ఉన్న ఈ కేంద్రం ఇరాన్ అణుశక్తి కార్యక్రమంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇందులో అనేక సెంట్రిఫ్యూజ్ క్యాస్కేడ్లు పని చేస్తుంటాయి. గతంలోనూ ఇది స్టక్స్నెట్ వైరస్, 2021లో బాంబు పేలుళ్ల వంటి దాడులకు గురైంది. అలాగే ఫోర్డో కేంద్రం తెహరాన్కు దక్షిణాన 100 కి.మీ. దూరంలో, క్వోమ్ నగరానికి సమీపంలో కొండల కింద నిర్మించబడిన ఈ కేంద్రం, గగనతల దాడులకు ఎదురుగానే రూపొందించబడింది. ఇక్కడ సైతం సెంట్రిఫ్యూజ్ క్యాస్కేడ్లు ఉన్నాయి. ఇరాన్ వర్గాల ప్రకారం ఫోర్డోకు జరిగిన నష్టం తక్కువగానే ఉందని ప్రకటించబడినా నిపుణుల దృష్టిలో దీనిపై ఖచ్చితమైన అంచనాలివ్వలేనని చెప్పారు.
Read Also: PM Modi: యోగా డే సందర్బంగా విశాఖలో ప్రధాని మోడీ పర్యటన..!
ఇరాన్ అణు బాంబులు తయారు చేస్తున్నదని, అవి తీవ్ర ఉగ్రవాద సంస్థలకు అందించబడే ప్రమాదముందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతాన్యహు హెచ్చరించారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన శాసన వ్యవస్థకు, అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు లభించకూడదని ఆయన పేర్కొన్నారు. మా పోరాటం ఇరానీయుల పట్ల కాదు. మా పోరాటం గత 46 సంవత్సరాలుగా ప్రజలను అణచివేస్తున్న తత్వవాది పాలనతోనే అని నెతాన్యహు అన్నారు. మీ విముక్తి సమయం సమీపంలోనే ఉంది. అది వచ్చినప్పుడు, మన మధ్య స్నేహం మళ్లీ వికసిస్తుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
-
GT Biggest Win: ఎస్ఆర్హెచ్పై గుజరాత్ చరిత్రాత్మక విజయం.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ విక్టరీ!
-
Avatar 3: ఫైనల్గా OTTలోకి ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!