Iran Nuclear Site: ఇజ్రాయెల్ కౌంటర్ దాడులతో ఇరాన్ అణు కేంద్రాల గుండె బద్దలైందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Nuclear Site: ఇజ్రాయెల్ చేపట్టిన “ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరిట నిర్వహించిన వైమానిక దాడుల తర్వాత, ఇరాన్ అణుశక్తి కేంద్రాల్లో సంభవించిన నష్టాన్ని స్పష్టంగా చూపించే ఉపగ్రహ చిత్రాలను మాక్సార్ టెక్నాలజీస్ విడుదల చేసింది. ఈ చిత్రాలలో నాటాంజ్, ఫోర్డో ఇంకా ఇస్ఫహాన్ ప్రాంతాల్లోని కీలక అణు కేంద్రాలపై జరిగిన దాడుల ముందు, తర్వాత పరిస్థితుల తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడులలో నాటాంజ్ అణు కేంద్రం పైభాగంలోని కీలక నిర్మాణాలు ధ్వంసమయ్యాయని, అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) పేర్కొంది. విద్యుత్ సరఫరా సదుపాయాలకు పెద్దెత్తున నష్టం వాటిల్లిందని ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ (ISIS) పేర్కొంది. విద్యుత్ లేమితో కేంద్రాల లోపల ఉన్న సెంట్రిఫ్యూజ్లు (యురేనియం శుద్ధికరణ యంత్రాలు) తీవ్రమైన నష్టాన్ని పొందవచ్చని పేర్కొంది.
Read Also: Asaduddin Owaisi: మోడీ, చంద్రబాబు, పవన్పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..!
Also Read
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
- Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
నాటాంజ్ అణు కేంద్రం తెహరాన్కు దక్షిణాన 220 కి.మీ. దూరంలో ఉన్న ఈ కేంద్రం ఇరాన్ అణుశక్తి కార్యక్రమంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇందులో అనేక సెంట్రిఫ్యూజ్ క్యాస్కేడ్లు పని చేస్తుంటాయి. గతంలోనూ ఇది స్టక్స్నెట్ వైరస్, 2021లో బాంబు పేలుళ్ల వంటి దాడులకు గురైంది. అలాగే ఫోర్డో కేంద్రం తెహరాన్కు దక్షిణాన 100 కి.మీ. దూరంలో, క్వోమ్ నగరానికి సమీపంలో కొండల కింద నిర్మించబడిన ఈ కేంద్రం, గగనతల దాడులకు ఎదురుగానే రూపొందించబడింది. ఇక్కడ సైతం సెంట్రిఫ్యూజ్ క్యాస్కేడ్లు ఉన్నాయి. ఇరాన్ వర్గాల ప్రకారం ఫోర్డోకు జరిగిన నష్టం తక్కువగానే ఉందని ప్రకటించబడినా నిపుణుల దృష్టిలో దీనిపై ఖచ్చితమైన అంచనాలివ్వలేనని చెప్పారు.
Read Also: PM Modi: యోగా డే సందర్బంగా విశాఖలో ప్రధాని మోడీ పర్యటన..!
ఇరాన్ అణు బాంబులు తయారు చేస్తున్నదని, అవి తీవ్ర ఉగ్రవాద సంస్థలకు అందించబడే ప్రమాదముందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతాన్యహు హెచ్చరించారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన శాసన వ్యవస్థకు, అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు లభించకూడదని ఆయన పేర్కొన్నారు. మా పోరాటం ఇరానీయుల పట్ల కాదు. మా పోరాటం గత 46 సంవత్సరాలుగా ప్రజలను అణచివేస్తున్న తత్వవాది పాలనతోనే అని నెతాన్యహు అన్నారు. మీ విముక్తి సమయం సమీపంలోనే ఉంది. అది వచ్చినప్పుడు, మన మధ్య స్నేహం మళ్లీ వికసిస్తుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ గా ఎంట్రీ?
-
Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడు? అర్హత, ఫీజు వివరాలు ఇవే
-
Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
-
Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!