Israel: గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిలో ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయెల్పై దాడులను చేసేందుకు హమాస్ మిలిటెంట్లు గాజాలోని అల్-షిఫా ఆసుపత్రి ప్రాంతాల్లో ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు.. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఆపరేషన్ను ప్రారంభించింది. ఇంటెలిజెన్స్ పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ను చేపట్టామని, పౌరులకు హాని చేయడం కంటే హమాస్ మిలిటెంట్లను ఎదుర్కోవడమే లక్ష్యమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రతినిధి ఒకరు సోమవారం తెల్లవారుజామున తెలిపారు.
Read Also: Sidhu Moosewala Mother: 58 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన సిద్దూ మూసేవాలా తల్లి
Also Read
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
“హమాస్కు చెందిన సీనియర్ ఉగ్రవాదులు అల్-షిఫా ఆసుపత్రిలో మళ్లీ గుమిగూడారని, ఇజ్రాయెల్పై దాడులకు ఆదేశిస్తున్నారని మాకు తెలుసు” అని డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రతినిధి హగారి చెప్పారు. పౌర ప్రాణనష్టాన్ని తగ్గించడానికి ఆపరేషన్ ఖచ్చితత్వంతో, జాగ్రత్తగా నిర్వహించబడుతుందని ఆయన చెప్పారు. రోగులు, వైద్య సిబ్బంది ఆస్పత్రిని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని, వదిలి వెళ్లాలనుకున్నా ఒక మార్గం అందుబాటులో ఉందన్నారు. ఆసుపత్రి కాంపౌండ్లో రోగులకు సహాయం చేయడానికి అరబిక్ మాట్లాడేవారిని, వైద్య సిబ్బందిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నియమించిందని చెప్పారు. పౌరులకు మానవతా సహాయం అందిస్తోందని వెల్లడించారు. వైద్య సదుపాయాలను ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించకూడదని చెబుతూ హమాస్ ఉగ్రవాదులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. “వైద్య సౌకర్యాలను టెర్రరిజం కోసం ఉపయోగించుకోకూడదు. హమాస్ తప్పనిసరిగా జవాబుదారీగా ఉండాలి” అని హగారి తన చిన్న వీడియో సందేశాన్ని ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్సెస్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసారు.
Read Also: Rahul Gandhi : ‘జైట్లీ నా వద్దకు వచ్చి.. భూసేకరణపై మాట్లాడకండి అన్నారు’.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ఇంతలో గాజాలోని హమాస్-నియంత్రిత ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొనసాగుతున్న ఇజ్రాయెల్ ఆపరేషన్పై ఒక ప్రకటన విడుదల చేసింది, “అల్-షిఫా మెడికల్ కాంప్లెక్స్లోని వైద్య సిబ్బంది, రోగులు, ఎక్కడి నుంచో వ్యక్తుల జీవితాలకు ఇజ్రాయెల్ బాధ్యత వహిస్తుంది” అని పేర్కొంది. ఈ దళాలు చేస్తున్న ఆక్రమణ.. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించడమేనని ఈ ప్రకటనలో పేర్కొంది.
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!