Israel Hamas War: 500 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న గాజా ఆసుపత్రి దాడిలో నిజానిజాలు ఏంటి ?
Israel Hamas War: గాజాలోని అల్-అహ్లీ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో కనీసం 500 మంది పౌరులు మరణించారు. అనేక ముస్లిం దేశాలు ఈ దాడికి ఇజ్రాయెల్ నే దోషిని చేశాయి. అయితే ఇజ్రాయెల్ ఈ దాడిలో తన ప్రమేయం లేదని ఖండించింది. ఈ దాడికి పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ సంస్థ కారణమని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ట్విట్టర్లో రాకెట్ దాడి జరిగినప్పుడు ఆసుపత్రి చుట్టూ ఉన్న ప్రాంతం గుండా ఇజ్రాయెల్ వైపు రాకెట్లను ప్రయోగించినట్లు తెలుసుకున్నామని రాసుకొచ్చింది. ఇస్లామిక్ జిహాద్ తీవ్రవాద సంస్థ ఆసుపత్రిలో రాకెట్ పేలుడుకు పాల్పడిందని ఆరోపించింది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. గాజాపై దాడి చేసింది అనాగరిక ఉగ్రవాదులే అని ప్రపంచం మొత్తం తెలుసుకోవాలి. వారు గాజాలోని ఆసుపత్రిపై దాడి చేశారు, ఇజ్రాయెల్ రక్షణ దళాలపై కాదు. మా పిల్లలను చంపే వ్యక్తులు ఇప్పుడు వారి స్వంత పిల్లలనే చంపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిని ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు ఖండించారు. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రతినిధి వైమానిక దాడిని ఖండిస్తూ, దీనిని “ఊచకోత, మానవతా విపత్తు” అని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్తో జరగాల్సిన సమావేశాన్ని కూడా అబ్బాస్ రద్దు చేసుకున్నారు. బిడెన్ బుధవారం ఇజ్రాయెల్ను సందర్శించనున్నారు.
Also Read
Read Also:NED vs SA: దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం.. మూడేళ్ల క్రితం ట్వీట్ వైరల్!
పాలస్తీనాతో పాటు జోర్డాన్ కూడా ఈ దాడిని ఖండించింది. మంగళవారం ఒక ప్రకటనలో.. జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్ ఆరోపించిన దాడిని తీవ్రంగా ఖండించింది, పాలస్తీనా పౌరులకు అంతర్జాతీయ రక్షణ అవసరాన్ని నొక్కి చెప్పింది. యుద్ధాన్ని ముగించాలని పిలుపునిచ్చింది. జోర్డాన్ రాజు అబ్దుల్లా II గాజా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ బాంబు దాడి చేయడం.. మారణహోమంపై ఎవరూ మౌనంగా ఉండలేరన్నారు. ఈ దాడి ప్రమాదకరమైన తీవ్రతను సూచిస్తోందని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ ఆరోపణలను పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ (PJI) తోసిపుచ్చింది. గాజా ఆసుపత్రిపై వైమానిక దాడికి సంస్థ దూరంగా ఉంది. ఇజ్రాయెల్ కల్పిత ఆరోపణలు చేస్తోందని ఇస్లామిక్ జిహాద్ ప్రతినిధి దావూద్ షహబ్ చెప్పినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. దావూద్ షహబ్ మాట్లాడుతూ.. ఇది అబద్ధం.. ఇది పూర్తిగా తప్పు.. సామాన్య పౌరులపై జరిగిన నీచమైన చర్యలను దాచిపెట్టే ప్రయత్నం ఇది.
గాజాలోని ఆసుపత్రిపై దాడిని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో ఖండించారు. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వైమానిక దాడిని ఖండించింది. ఇది నిరాయుధ, రక్షణ లేని వ్యక్తులపై దాడి అని పేర్కొంది. ఈ దాడిపై ఉత్తర అమెరికా దేశం కెనడా ఆందోళన వ్యక్తం చేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దాడిని ఖండించారు. యుద్ధ చట్టాలను అనుసరించడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అరబ్ లీగ్ అధినేత అహ్మద్ అబౌల్ ఘెయిట్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ నాయకులు దాడికి ప్రతిస్పందనగా ఈ విషాదాన్ని తక్షణమే ఆపాలన్నారు.
Read Also:NED vs SA: దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం.. మూడేళ్ల క్రితం ట్వీట్ వైరల్!
WHO ఏం చెప్పింది?
“అల్ అహ్లీ అరబ్ ఆసుపత్రిపై దాడిని WHO తీవ్రంగా ఖండిస్తుంది” అని UN ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X లో తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..
-
MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?
-
Thyroid Health : వారసత్వంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయా.? నిపుణులు చెబుతున్న కీలక సూత్రాలు..!
-
Oil Crisis: భారత్కు గుడ్ న్యూస్.. చమురు రూటు మార్చిన యూఏఈ..
-
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో