Israel Hamas War: ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీకర యుద్ధం.. 235 మందితో ఢిల్లీకి చేరుకున్న మరో విమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Hamas War: హమాస్తో కొనసాగుతున్న యుద్ధం మధ్య ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. దీని కింద ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. 212 మంది భారతీయ పౌరులతో కూడిన మొదటి బ్యాచ్ శుక్రవారం భారతదేశానికి చేరుకుంది. కాగా, ఈరోజు 235 మంది భారతీయులతో కూడిన మరో బృందం ఢిల్లీకి చేరుకుంది. భారతీయులను స్వీకరించేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్కుమార్ రంజన్ సింగ్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఇజ్రాయెల్ నుండి భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా రెండవ విమానం శుక్రవారం సాయంత్రం 5.35 గంటలకు టెల్ అవీవ్ నుండి బయలుదేరింది. దాదాపు 18,000 మంది భారతీయులు ఇజ్రాయెల్లో చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వం బుధవారం నుంచి ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. భారత పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
Also Read
- Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
- Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
Read Also:BJP Manifesto: మేనిఫెస్టోపై టి.బీజేపీ కసరత్తు.. అమలు సాధ్యమయ్యే హామీలు మాత్రమే..!
మొదటి బ్యాచ్ 212 మంది పౌరులు శుక్రవారం ఉదయం చార్టర్డ్ విమానం ద్వారా భారతదేశానికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ నుండి భారతీయ పౌరులు తిరిగి రావడానికి మొదటి విమానం గురువారం సాయంత్రం 212 మందితో బెన్ గురియన్ విమానాశ్రయం నుండి బయలుదేరి శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. వారి రిటర్న్ ఖర్చులను భారత ప్రభుత్వం భరిస్తుంది. ఇజ్రాయెల్లో ప్రస్తుతం 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం తెలిపారు.
గత శనివారం ఉదయం హమాస్ అకస్మాత్తుగా ఇజ్రాయెల్పై దాడి చేసింది. హమాస్ యోధులు ఇజ్రాయెల్పై 5000కు పైగా రాకెట్లను ప్రయోగించారు. ఈ దాడిలో 1300 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలు మరణించగా, వేలాది మంది గాయపడ్డారు. ఈ దాడి తరువాత ఇజ్రాయెల్ కూడా ప్రతీకారం తీర్చుకుంది. ఇందులో వందలాది మంది హమాస్ ప్రజలు మరణించారు.. వేలాది మంది ప్రజలు గాయపడ్డారు. గత ఏడు రోజులుగా వీరిద్దరి మధ్య వార్ నడుస్తోంది. హమాస్పై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తోంది. దాదాపు 3 లక్షల మంది సైనికులు గాజా స్ట్రిప్లో మోహరించారు.
Read Also:India vs Pakistan: 10 సెకన్లలో 30 లక్షలు సంపాదిస్తున్న డిస్నీ హాట్ స్టార్
తాజావార్తలు
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
-
Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
-
India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
-
Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. జీతంలో 1.5% కట్.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!