Israel Hamas War: ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీకర యుద్ధం.. 235 మందితో ఢిల్లీకి చేరుకున్న మరో విమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Hamas War: హమాస్తో కొనసాగుతున్న యుద్ధం మధ్య ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. దీని కింద ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. 212 మంది భారతీయ పౌరులతో కూడిన మొదటి బ్యాచ్ శుక్రవారం భారతదేశానికి చేరుకుంది. కాగా, ఈరోజు 235 మంది భారతీయులతో కూడిన మరో బృందం ఢిల్లీకి చేరుకుంది. భారతీయులను స్వీకరించేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్కుమార్ రంజన్ సింగ్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఇజ్రాయెల్ నుండి భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా రెండవ విమానం శుక్రవారం సాయంత్రం 5.35 గంటలకు టెల్ అవీవ్ నుండి బయలుదేరింది. దాదాపు 18,000 మంది భారతీయులు ఇజ్రాయెల్లో చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వం బుధవారం నుంచి ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. భారత పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
Also Read
- AUS Vs BAN: బౌలర్ వేసిన బంతి తగలడంతో వాంతి చేసుకున్నాడు.. అయినా సిక్స్ కొట్టి గెలిపించాడు..
- Water Tank Cleaning Tips: వాటర్ ట్యాంక్లో మురికి పేరుకుపోయిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేయండి
- US-Iran: ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Aashirwad Sooryavanshi: మరో సూర్యవంశీ వస్తున్నాడండోయ్.. తొలి శతకాన్ని నమోదు చేసిన ఆశీర్వాద్..
Read Also:BJP Manifesto: మేనిఫెస్టోపై టి.బీజేపీ కసరత్తు.. అమలు సాధ్యమయ్యే హామీలు మాత్రమే..!
మొదటి బ్యాచ్ 212 మంది పౌరులు శుక్రవారం ఉదయం చార్టర్డ్ విమానం ద్వారా భారతదేశానికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ నుండి భారతీయ పౌరులు తిరిగి రావడానికి మొదటి విమానం గురువారం సాయంత్రం 212 మందితో బెన్ గురియన్ విమానాశ్రయం నుండి బయలుదేరి శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. వారి రిటర్న్ ఖర్చులను భారత ప్రభుత్వం భరిస్తుంది. ఇజ్రాయెల్లో ప్రస్తుతం 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం తెలిపారు.
గత శనివారం ఉదయం హమాస్ అకస్మాత్తుగా ఇజ్రాయెల్పై దాడి చేసింది. హమాస్ యోధులు ఇజ్రాయెల్పై 5000కు పైగా రాకెట్లను ప్రయోగించారు. ఈ దాడిలో 1300 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలు మరణించగా, వేలాది మంది గాయపడ్డారు. ఈ దాడి తరువాత ఇజ్రాయెల్ కూడా ప్రతీకారం తీర్చుకుంది. ఇందులో వందలాది మంది హమాస్ ప్రజలు మరణించారు.. వేలాది మంది ప్రజలు గాయపడ్డారు. గత ఏడు రోజులుగా వీరిద్దరి మధ్య వార్ నడుస్తోంది. హమాస్పై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తోంది. దాదాపు 3 లక్షల మంది సైనికులు గాజా స్ట్రిప్లో మోహరించారు.
Read Also:India vs Pakistan: 10 సెకన్లలో 30 లక్షలు సంపాదిస్తున్న డిస్నీ హాట్ స్టార్
తాజావార్తలు
-
AUS Vs BAN: బౌలర్ వేసిన బంతి తగలడంతో వాంతి చేసుకున్నాడు.. అయినా సిక్స్ కొట్టి గెలిపించాడు..
-
Director VV Vinayak: వడ్డే నవీన్ సినిమా వల్లే ఎన్టీఆర్తో పరిచయం.. ‘ఆది’ మూవీ జ్ఞాపకాలను పంచుకున్న డైరెక్టర్!
-
Water Tank Cleaning Tips: వాటర్ ట్యాంక్లో మురికి పేరుకుపోయిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేయండి
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘‘భారత క్రికెట్ నిధి’’.. మాజీ స్టార్ ప్రశంసలు..
-
US-Iran: ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!