Israel Hamas War: ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీకర యుద్ధం.. 235 మందితో ఢిల్లీకి చేరుకున్న మరో విమానం
Israel Hamas War: హమాస్తో కొనసాగుతున్న యుద్ధం మధ్య ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. దీని కింద ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. 212 మంది భారతీయ పౌరులతో కూడిన మొదటి బ్యాచ్ శుక్రవారం భారతదేశానికి చేరుకుంది. కాగా, ఈరోజు 235 మంది భారతీయులతో కూడిన మరో బృందం ఢిల్లీకి చేరుకుంది. భారతీయులను స్వీకరించేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్కుమార్ రంజన్ సింగ్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఇజ్రాయెల్ నుండి భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా రెండవ విమానం శుక్రవారం సాయంత్రం 5.35 గంటలకు టెల్ అవీవ్ నుండి బయలుదేరింది. దాదాపు 18,000 మంది భారతీయులు ఇజ్రాయెల్లో చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వం బుధవారం నుంచి ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. భారత పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
Also Read
- Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్లో పస తగ్గిందా..? ఈ IPL లో విఫలం అవ్వడానికి కారణం ఇదే..
- Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
- Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
Read Also:BJP Manifesto: మేనిఫెస్టోపై టి.బీజేపీ కసరత్తు.. అమలు సాధ్యమయ్యే హామీలు మాత్రమే..!
మొదటి బ్యాచ్ 212 మంది పౌరులు శుక్రవారం ఉదయం చార్టర్డ్ విమానం ద్వారా భారతదేశానికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ నుండి భారతీయ పౌరులు తిరిగి రావడానికి మొదటి విమానం గురువారం సాయంత్రం 212 మందితో బెన్ గురియన్ విమానాశ్రయం నుండి బయలుదేరి శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. వారి రిటర్న్ ఖర్చులను భారత ప్రభుత్వం భరిస్తుంది. ఇజ్రాయెల్లో ప్రస్తుతం 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం తెలిపారు.
గత శనివారం ఉదయం హమాస్ అకస్మాత్తుగా ఇజ్రాయెల్పై దాడి చేసింది. హమాస్ యోధులు ఇజ్రాయెల్పై 5000కు పైగా రాకెట్లను ప్రయోగించారు. ఈ దాడిలో 1300 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలు మరణించగా, వేలాది మంది గాయపడ్డారు. ఈ దాడి తరువాత ఇజ్రాయెల్ కూడా ప్రతీకారం తీర్చుకుంది. ఇందులో వందలాది మంది హమాస్ ప్రజలు మరణించారు.. వేలాది మంది ప్రజలు గాయపడ్డారు. గత ఏడు రోజులుగా వీరిద్దరి మధ్య వార్ నడుస్తోంది. హమాస్పై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తోంది. దాదాపు 3 లక్షల మంది సైనికులు గాజా స్ట్రిప్లో మోహరించారు.
Read Also:India vs Pakistan: 10 సెకన్లలో 30 లక్షలు సంపాదిస్తున్న డిస్నీ హాట్ స్టార్
తాజావార్తలు
-
Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్లో పస తగ్గిందా..? ఈ IPL లో విఫలం అవ్వడానికి కారణం ఇదే..
-
Mojtaba Khamenei: “సముద్ర గర్భంలో పాతిపెడతాం”.. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Jowar Dosa : షుగర్కు చెక్.. వెయిట్ లాస్ పక్కా.. జొన్న దోశ మ్యాజిక్..!
-
Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
-
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!