Israel Hamas War: ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీకర యుద్ధం.. 235 మందితో ఢిల్లీకి చేరుకున్న మరో విమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Hamas War: హమాస్తో కొనసాగుతున్న యుద్ధం మధ్య ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. దీని కింద ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. 212 మంది భారతీయ పౌరులతో కూడిన మొదటి బ్యాచ్ శుక్రవారం భారతదేశానికి చేరుకుంది. కాగా, ఈరోజు 235 మంది భారతీయులతో కూడిన మరో బృందం ఢిల్లీకి చేరుకుంది. భారతీయులను స్వీకరించేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్కుమార్ రంజన్ సింగ్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఇజ్రాయెల్ నుండి భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా రెండవ విమానం శుక్రవారం సాయంత్రం 5.35 గంటలకు టెల్ అవీవ్ నుండి బయలుదేరింది. దాదాపు 18,000 మంది భారతీయులు ఇజ్రాయెల్లో చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వం బుధవారం నుంచి ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. భారత పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
Also Read
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
Read Also:BJP Manifesto: మేనిఫెస్టోపై టి.బీజేపీ కసరత్తు.. అమలు సాధ్యమయ్యే హామీలు మాత్రమే..!
మొదటి బ్యాచ్ 212 మంది పౌరులు శుక్రవారం ఉదయం చార్టర్డ్ విమానం ద్వారా భారతదేశానికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ నుండి భారతీయ పౌరులు తిరిగి రావడానికి మొదటి విమానం గురువారం సాయంత్రం 212 మందితో బెన్ గురియన్ విమానాశ్రయం నుండి బయలుదేరి శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. వారి రిటర్న్ ఖర్చులను భారత ప్రభుత్వం భరిస్తుంది. ఇజ్రాయెల్లో ప్రస్తుతం 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం తెలిపారు.
గత శనివారం ఉదయం హమాస్ అకస్మాత్తుగా ఇజ్రాయెల్పై దాడి చేసింది. హమాస్ యోధులు ఇజ్రాయెల్పై 5000కు పైగా రాకెట్లను ప్రయోగించారు. ఈ దాడిలో 1300 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలు మరణించగా, వేలాది మంది గాయపడ్డారు. ఈ దాడి తరువాత ఇజ్రాయెల్ కూడా ప్రతీకారం తీర్చుకుంది. ఇందులో వందలాది మంది హమాస్ ప్రజలు మరణించారు.. వేలాది మంది ప్రజలు గాయపడ్డారు. గత ఏడు రోజులుగా వీరిద్దరి మధ్య వార్ నడుస్తోంది. హమాస్పై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తోంది. దాదాపు 3 లక్షల మంది సైనికులు గాజా స్ట్రిప్లో మోహరించారు.
Read Also:India vs Pakistan: 10 సెకన్లలో 30 లక్షలు సంపాదిస్తున్న డిస్నీ హాట్ స్టార్
తాజావార్తలు
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!