Israel Hamas War : ఇజ్రాయెల్లో తుపాకీలకు పెరిగిన డిమాండ్… 42వేల మంది మహిళలు దరఖాస్తు
- ఇజ్రాయెల్లో భయాందోళనలో మహిళలు
- తుపాకులకు పెరిగిన డిమాండ్
- తుపాకీలు కావాలని 42వేల దరఖాస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Hamas War : ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాదాపు 8 నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పడం కష్టం. రెండు దేశాల మధ్య జరిగిన ఈ యుద్ధంలో వేలాది మంది మరణించగా, లక్షలాది మంది గాయపడ్డారు. హమాస్ దాడి తర్వాత, ఇజ్రాయెల్లో ఆయుధాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇజ్రాయెల్ మహిళలు కూడా శత్రువుల దాడుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఆయుధాలను ఉపయోగించడం నేర్చుకున్నారు. అందరిలో తుపాకీకి డిమాండ్ ఉంది. ఇజ్రాయెల్ మహిళలు తుపాకులు ఉపయోగించడంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఇది మాత్రమే కాదు, హమాస్ దాడి తర్వాత 42,000 మంది ఇజ్రాయెల్ మహిళలు తుపాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 18వేలు మంజూరయ్యాయి. ఈ సంఖ్య గతంలో కంటే చాలా ఎక్కువ. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ముందు మహిళలకు ఉన్న లైసెన్స్ల సంఖ్య కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ.
Read Also:Fraud Case : లైన్ మెన్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 9 లక్షలు వాసులు చేసిన కార్పొరేటర్..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ మహిళలు మరింత ఆందోళనకు గురయ్యారని చెబుతున్నారు. తనను తాను సురక్షితంగా భావించడం లేదు కాబట్టి రక్షించుకోవడానికి తుపాకీని కొనుగోలు చేస్తోందని.. భద్రతా మంత్రిత్వ శాఖ డేటా పేర్కొ్ంది. ప్రస్తుతం ఇజ్రాయెల్లో 15,000 మంది మహిళలు తుపాకీలను కలిగి ఉన్నారు. 10 వేల మంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు. హమాస్ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసింది. హమాస్ దాడిలో ఇజ్రాయెల్లో దాదాపు 1200 మంది చనిపోయారు. 200 మందికి పైగా ఇజ్రాయిలీలు కూడా బందీలుగా ఉన్నారు. దీని తర్వాత ఇజ్రాయెల్ కూడా హమాస్పై ప్రతీకారం తీర్చుకుంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. పెద్ద ఎత్తున సైనిక ఆపరేషన్ నిర్వహించింది. హమాస్ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇప్పటివరకు, ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో 37,000 మందికి పైగా మరణించారు, గాయపడిన వారి సంఖ్య చాలా ఎక్కువ. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు.
Read Also:Devara : దేవర కోసం రంగంలోకి దిగిన ఆ స్టార్ కొరియోగ్రాఫర్..
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!