Rohit Sharma: వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో రోహిత్ శర్మ..?
- ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ యోచనలో రోహిత్ శర్మ
- టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20లకు రిటైర్మింట్ ప్రకటించిన రోహిత్, కోహ్లీ
- నిన్న ప్రెస్ మీట్ కు హాజరుకాని రోహిత్ శర్మ
- రోహిత్ స్థానంలో ప్రెస్ మీట్ కు వచ్చిన గిల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో రోహిత్ శర్మ..? ఉన్నట్లు సమాచారం. తన భవిష్యత్పై సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్తో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read Also: IND vs NZ Finals: ఇండియా గెలవాలని గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు పూజలు..
Also Read
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
- 6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
- ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
- Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. నిన్న రోహిత్ శర్మ ప్రెస్మీట్కి హాజరు కాలేదు. రోహిత్ స్థానంలో ప్రెస్మీట్కి శుభ్మాన్ గిల్ వచ్చాడు. ఈ క్రమంలో.. రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై గిల్ స్పందించాడు. కెప్టెన్తో సహా అందరి దృష్టి ఫైనల్పైనే ఉంది.. రోహిత్ భవిష్యత్తు గురించి ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపాడు. డ్రెస్సింగ్ రూమ్లో కానీ, వ్యక్తిగతంగా తనతో కానీ రిటైర్మెంట్ పై ఎలాంటి చర్చ చేయలేదని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధికగా 3 డబుల్ సెంచరీలు చేశాడు. వరల్డ్ కప్ల్లో అత్యధిక 7 సెంచరీలు చేశాడు. ఆటగాడిగా రోహిత్ శర్మపై ఎన్నో రికార్డులు ఉన్నాయి. టీ20ల్లో 35 బంతుల్లోనే అత్యంత వేగంగా సెంచరీ సాధించిన క్రికెటర్గా రోహిత్ పేరును లిఖించుకున్నాడు.
Read Also: Crime: ఎన్నారై మహిళ మృతి కేసులో కొనసాగుతున్న మిస్టరీ!
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా 7వ ఐసిసి టైటిల్పై కన్నేసింది. ఇంతకు ముందు.. భారత్ 2 వన్డే ప్రపంచ కప్లు (1983, 2011), రెండు టీ 20 ప్రపంచ కప్లు (2007, 2024), రెండు ఛాంపియన్స్ ట్రోఫీలను (2002, 2013) గెలుచుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించాలని రోహిత్ సేన చూస్తోంది. కాసేపట్లో దుబాయ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనున్నాయి. ఈ క్రమంలో.. భారత్ గెలవాలంటూ టీమిండియా ఫ్యాన్స్ పూజలు, హోమాలు చేస్తున్నారు. మరోవైపు.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పై జోరుగా బెట్టింగ్స్ నడుస్తున్నాయి. రూ. 5 వేల కోట్లు చేతులు మారబోతున్నాయి. దుబాయ్ నుంచి క్రికెట్ బెట్టింగ్స్ నడుస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఐదుగురు బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?