Rohit Sharma: వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో రోహిత్ శర్మ..?
- ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ యోచనలో రోహిత్ శర్మ
- టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20లకు రిటైర్మింట్ ప్రకటించిన రోహిత్, కోహ్లీ
- నిన్న ప్రెస్ మీట్ కు హాజరుకాని రోహిత్ శర్మ
- రోహిత్ స్థానంలో ప్రెస్ మీట్ కు వచ్చిన గిల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో రోహిత్ శర్మ..? ఉన్నట్లు సమాచారం. తన భవిష్యత్పై సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్తో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read Also: IND vs NZ Finals: ఇండియా గెలవాలని గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు పూజలు..
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. నిన్న రోహిత్ శర్మ ప్రెస్మీట్కి హాజరు కాలేదు. రోహిత్ స్థానంలో ప్రెస్మీట్కి శుభ్మాన్ గిల్ వచ్చాడు. ఈ క్రమంలో.. రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై గిల్ స్పందించాడు. కెప్టెన్తో సహా అందరి దృష్టి ఫైనల్పైనే ఉంది.. రోహిత్ భవిష్యత్తు గురించి ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపాడు. డ్రెస్సింగ్ రూమ్లో కానీ, వ్యక్తిగతంగా తనతో కానీ రిటైర్మెంట్ పై ఎలాంటి చర్చ చేయలేదని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధికగా 3 డబుల్ సెంచరీలు చేశాడు. వరల్డ్ కప్ల్లో అత్యధిక 7 సెంచరీలు చేశాడు. ఆటగాడిగా రోహిత్ శర్మపై ఎన్నో రికార్డులు ఉన్నాయి. టీ20ల్లో 35 బంతుల్లోనే అత్యంత వేగంగా సెంచరీ సాధించిన క్రికెటర్గా రోహిత్ పేరును లిఖించుకున్నాడు.
Read Also: Crime: ఎన్నారై మహిళ మృతి కేసులో కొనసాగుతున్న మిస్టరీ!
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా 7వ ఐసిసి టైటిల్పై కన్నేసింది. ఇంతకు ముందు.. భారత్ 2 వన్డే ప్రపంచ కప్లు (1983, 2011), రెండు టీ 20 ప్రపంచ కప్లు (2007, 2024), రెండు ఛాంపియన్స్ ట్రోఫీలను (2002, 2013) గెలుచుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించాలని రోహిత్ సేన చూస్తోంది. కాసేపట్లో దుబాయ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనున్నాయి. ఈ క్రమంలో.. భారత్ గెలవాలంటూ టీమిండియా ఫ్యాన్స్ పూజలు, హోమాలు చేస్తున్నారు. మరోవైపు.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పై జోరుగా బెట్టింగ్స్ నడుస్తున్నాయి. రూ. 5 వేల కోట్లు చేతులు మారబోతున్నాయి. దుబాయ్ నుంచి క్రికెట్ బెట్టింగ్స్ నడుస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఐదుగురు బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!