Vishaka MP Seat: ఏపీ బీజేపీలో పెరుగుతోన్న పోటీ.. విశాఖపై కీలక నేతల కన్ను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakha MP Seat Competition in BJP: లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ దేశవ్యాప్తంగా రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎలెక్షన్స్ కూడా ఉన్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. కొన్నిచోట్ల సీట్ కోసం కీలక నేతలు కన్నేశారు. అందులో ఒకటి విశాఖ సీట్. ఈ సీట్ కోసం బీజేపీలో రోజురోజుకి పోటీ పెరుగుతోంది.
విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖ నుంచి పోటీ చేస్తానని అధిష్టానానికి సీఎం రమేష్ ఇప్పటికే చెప్పారట. విశాఖ లోక్ సభ టిక్కెట్ ఆశించి.. ఇప్పటికే అక్కడ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మకాం వేశారు. తనదైన శైలిలో అక్కడి ప్రజలను ఆకర్షిస్తున్నారు. బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి పేరునూ పార్టీ హైకమాండ్ ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏ చిన్న అవకాశం ఉన్నా.. విశాఖ నుంచి ఏపీగా ఆమెను దించాలని చూస్తోందట. ఇక టీడీపీ నుంచి బాలయ్య బాబు చిన్నల్లుడు భరత్ టిక్కెట్ ఆశిస్తున్నారట. దాంతో ఇక్కడా తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో విశాఖ ఎవరికి దక్కుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
Also Read
- Siddaramaiah: "హిజాబ్"కు అనుమతి, "కాషాయ కండువాల"కు నో పర్మిషన్..
- Keralam: గవర్నర్ను కలిసిన సతీశన్.. 18న సీఎంగా ప్రమాణస్వీకారం
- TG Intermediate: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు.. ఇక ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్..
- Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
Also Read: Peddireddy Ramachandra Reddy: ప్రజలు ఎవ్వరూ చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో లేరు: పెద్దిరెడ్డి
ఆయితే ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ కీలక నేతలు సమావేశమై ఇందుకు సంబంధించి చర్చలు జరిపినట్లు సమాచారం. ఢిల్లీ నేతలు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సహా ఏపీకి చెందిన పలువురు నేతలు ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని భావిస్తుండగా.. తాజా పరిణామం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బీజేపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో పోటీకి రికార్ఢు స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటివరకు 3283 దరఖాస్తులు.. 25 లోక్సభ స్థానాలకు 1861 దరఖాస్తులు అందాయని తెలుస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : నీట్-యూజీ 2026 రద్దు… మోడీ సర్కార్ ఫెయిల్
-
Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్కుమార్ విశ్వరూపం!
-
Siddaramaiah: “హిజాబ్”కు అనుమతి, “కాషాయ కండువాల”కు నో పర్మిషన్..
-
Keralam: గవర్నర్ను కలిసిన సతీశన్.. 18న సీఎంగా ప్రమాణస్వీకారం
-
TG Intermediate: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు.. ఇక ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!