Vishaka MP Seat: ఏపీ బీజేపీలో పెరుగుతోన్న పోటీ.. విశాఖపై కీలక నేతల కన్ను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakha MP Seat Competition in BJP: లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ దేశవ్యాప్తంగా రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎలెక్షన్స్ కూడా ఉన్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. కొన్నిచోట్ల సీట్ కోసం కీలక నేతలు కన్నేశారు. అందులో ఒకటి విశాఖ సీట్. ఈ సీట్ కోసం బీజేపీలో రోజురోజుకి పోటీ పెరుగుతోంది.
విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖ నుంచి పోటీ చేస్తానని అధిష్టానానికి సీఎం రమేష్ ఇప్పటికే చెప్పారట. విశాఖ లోక్ సభ టిక్కెట్ ఆశించి.. ఇప్పటికే అక్కడ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మకాం వేశారు. తనదైన శైలిలో అక్కడి ప్రజలను ఆకర్షిస్తున్నారు. బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి పేరునూ పార్టీ హైకమాండ్ ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏ చిన్న అవకాశం ఉన్నా.. విశాఖ నుంచి ఏపీగా ఆమెను దించాలని చూస్తోందట. ఇక టీడీపీ నుంచి బాలయ్య బాబు చిన్నల్లుడు భరత్ టిక్కెట్ ఆశిస్తున్నారట. దాంతో ఇక్కడా తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో విశాఖ ఎవరికి దక్కుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
Also Read: Peddireddy Ramachandra Reddy: ప్రజలు ఎవ్వరూ చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో లేరు: పెద్దిరెడ్డి
ఆయితే ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ కీలక నేతలు సమావేశమై ఇందుకు సంబంధించి చర్చలు జరిపినట్లు సమాచారం. ఢిల్లీ నేతలు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సహా ఏపీకి చెందిన పలువురు నేతలు ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని భావిస్తుండగా.. తాజా పరిణామం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బీజేపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో పోటీకి రికార్ఢు స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటివరకు 3283 దరఖాస్తులు.. 25 లోక్సభ స్థానాలకు 1861 దరఖాస్తులు అందాయని తెలుస్తోంది.
తాజావార్తలు
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!