Shah Rukh Khan: ఆర్యన్ ఖాన్ షోపై ఐఆర్ఎస్ అధికారి ఫైర్.. షారుఖ్-గౌరీ సహా నెట్ఫ్లిక్స్పై రూ.2 కోట్ల పరువు నష్టం దావా..
- ఆర్యన్ ఖాన్ షోపై ఐఆర్ఎస్ అధికారి ఫైర్
- షారుఖ్-గౌరీ సహా నెట్ఫ్లిక్స్పై రూ.2 కోట్ల పరువు నష్టం దావా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన నెట్ఫ్లిక్స్ షో “ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్”కు వ్యతిరేకంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి సమీర్ వాంఖడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ షోపై దాఖలు చేసిన పరువు నష్టం దావాలో, వాంఖడే షో నిర్మాతలు, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ యజమానులు, నటుడు షారుఖ్ ఖాన్, అతని భార్య గౌరీ ఖాన్, అలాగే నెట్ఫ్లిక్స్, ఇతరుల నుండి రూ. 2 కోట్ల నష్టపరిహారం కోరాడు. ఈ సిరీస్లో తన పాత్ర చిత్రీకరణ తప్పుడు, దురుద్దేశపూరితమైన, పరువు నష్టం కలిగించేలా ఉందని వాంఖడే ఆరోపించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరోసారి చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు.
Also Read:Kishan Reddy: సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వాఖ్యలు..
Also Read
- Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
- YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
- Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
- Mohammed Siraj: కొలంబోలో 'డీఎస్పీ సాబ్' రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ యాజమాన్యంలోని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్, ఇతర పార్టీలపై ఐఆర్ఎస్ అధికారి సమీర్ వాంఖడే పరువు నష్టం దావా వేశారు. ఈ సిరీస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ప్రతిష్టను దెబ్బతీస్తుందని, చట్ట అమలు సంస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని సమీర్ వాంఖడే ఆరోపించాడు. ఈ సిరీస్లో సమీర్ను పోలి ఉండే డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఒక పార్టీపై దాడి చేసే సన్నివేశం ఉంది. ఇది 2021 క్రూయిజ్ రైడ్ కు సంబంధించింది. ఈ సన్నివేశం ఉద్దేశపూర్వకంగా పక్షపాతంతో, పరువు నష్టం కలిగించేలా ఉందని సమీర్ పేర్కొన్నాడు.
సమీర్ వాంఖడే, ఆర్యన్ ఖాన్ కేసు ఇప్పటికీ బాంబే హైకోర్టులో, ముంబైలోని ప్రత్యేక NDPS కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ సిరీస్లోని ఒక కలతపెట్టే సన్నివేశాన్ని సమీర్ ఎత్తి చూపాడు. అందులో ఒక పాత్ర “సత్యమేవ జయతే” అని చెప్పి వెంటనే అసభ్యకరమైన సంజ్ఞ చేస్తుంది. దీనిని అతను జాతీయ చిహ్నానికి అవమానంగా, 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపించాడు.
ఈ సిరీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్లను ఉల్లంఘిస్తోందని, అశ్లీల విషయాలను ఉపయోగించడం ద్వారా జాతీయ మనోభావాలను కించపరిచే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ సమీర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్లో, రూ. 2 కోట్ల పరిహారం కోరుతూ, క్యాన్సర్ రోగుల చికిత్స కోసం టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇవ్వాలని ప్రతిపాదించాడు.
Also Read:OG 2 : ఓజీ 2లో సాహో.. స్పందించిన సుజిత్
2021 లో ఏం జరిగింది?
సమీర్ వాంఖడే, ఆర్యన్ ఖాన్ మధ్య గొడవ అక్టోబర్ 2, 2021న జరిగింది. ఆ సమయంలో, సమీర్ నేతృత్వంలోని NCB, ముంబై సమీపంలోని ఒక క్రూయిజ్ షిప్లో ఒక పార్టీపై దాడి చేసింది. ఆ నౌకలో కొంతమంది వ్యక్తులు మాదకద్రవ్యాలను కలిగి ఉన్నట్లు తేలింది. ఆర్యన్ ఖాన్, ఇతరులను NDPS చట్టం కింద అరెస్టు చేశారు, కానీ ఆధారాలు లేకపోవడంతో NCB తరువాత వారిని నిర్దోషిగా విడుదల చేసింది. తదనంతరం, వారిపై ఉన్న అభియోగాలను తొలగించారు. NDPS కోర్టు వారి పాస్పోర్ట్లను తిరిగి ఇచ్చింది.
తాజావార్తలు
-
Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
-
YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!