Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్కు ఎంత చెల్లించాలో తెలుసా..?
- మాస్టర్ ప్లాన్ వేసిన ఇరాన్..
- ప్రతీ నౌక నుంచి రుసుము వసూలు..
- డైరెక్ట్ మనీ కాకుండా.. క్రిప్టోలో చెల్లించాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా ప్రయాణించే చమురు నౌకలపై భారీగా ఆదాయం సమకూర్చుకోవాలని ఇరాన్ మాస్టర్ ప్లాన్ వేసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ జలసంధి గుండా వెళ్లే ప్రతి చమురు ట్యాంకర్ నుంచి ఒక బ్యారెల్కు ఒక డాలర్ వంతున ‘టోల్ ఫీజు’ వసూలు చేయాలని ఇరాన్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలోని అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ చెల్లింపులను సాధారణ కరెన్సీలో కాకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా మాత్రమే చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.
ప్రతిపాదన వెనుక అసలు ఉద్దేశం ఇదేనా..?
అమెరికా వంటి దేశాలు ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న తరుణంలో.. అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థతో సంబంధం లేకుండా నిధులు సమకూర్చుకోవడానికి ఇరాన్ ఈ ‘క్రిప్టో టోల్’ మార్గాన్ని ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ఆయిల్ ఎగుమతిదారుల సంఘం ప్రతినిధి హమీద్ హొస్సేని ఈ ప్రతిపాదనను అధికారికంగా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20 శాతం ఈ జలసంధి నుండే వెళ్తుంది కాబట్టి.. ఈ టోల్ గనుక అమలైతే ఇరాన్ ఖజానాకు వేల కోట్ల డాలర్ల ఆదాయం సమకూరనుంది.
Also Read
- West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
- Rahul Gandhi: “భయపడొద్దు.. ముస్లింలకు మద్దతుగా నిలవాలి”.. రాహుల్ గాంధీ
- Pakistan: పాకిస్తాన్లో రక్తపాతం.. జాఫర్ ఎక్స్ప్రెస్పై బీఎల్ఏ దాడి.. 23 మంది దుర్మరణం
- MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
తిరిగి ప్రారంభమైన నౌకల రాకపోకలు..
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత.. కొన్నాళ్లుగా మూతపడిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరిచింది. మెరైన్ ట్రాఫిక్ సంస్థ నివేదిక ప్రకారం.. గ్రీస్కు చెందిన ‘NJ Earth’ అనే బల్క్ క్యారియర్ మరియు లైబీరియా జెండాతో ఉన్న మరో నౌక విజయవంతంగా ఈ జలసంధిని దాటాయి. పశ్చిమ దేశాల నౌకలు కూడా ఈ మార్గంలో ప్రయాణించడం అంతర్జాతీయ వాణిజ్యానికి కొంత ఊరట కలిగించే అంశం.
హార్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ఇది పర్షియన్ గల్ఫ్ , గల్ఫ్ ఆఫ్ ఒమన్లను కలుపుతుంది. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ వంటి దేశాల నుంచి వచ్చే చమురు నౌకలకు ఇది ఏకైక మార్గం. ఈ మార్గాన్ని ఇరాన్ తన నియంత్రణలోకి తీసుకుని టోల్ వసూలు చేయాలని చూడటం ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరగడానికి దారితీయవచ్చు. ఇరాన్ తాజా డిమాండ్పై అగ్రరాజ్యాలు ఎలా స్పందిస్తాయో అన్నది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉత్కంఠ రేపుతోంది.
తాజావార్తలు
-
Rishabh Pant’s LSG Captaincy: రూ.27 కోట్లు పెట్టి కొంటే.. అట్టర్ ఫ్లాప్ ప్రదర్శన.. పంత్ కెప్టెన్సీకి ముప్పు!
-
BYD Atto 3: BYD అట్టో 3 విడుదల.. 630KM రేంజ్, LiDAR టెక్నాలజీ, కేవలం 9 నిమిషాల్లో పూర్తి ఛార్జ్
-
West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
-
Puri Jagannadh: ‘పర్ఫెక్ట్ హస్బెండ్’ ఆడియో వివాదం పై.. ఎట్టకేలకు నోరు విప్పిన పూరి జగన్నాథ్
-
Rahul Gandhi: “భయపడొద్దు.. ముస్లింలకు మద్దతుగా నిలవాలి”.. రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?