Shreyas Iyer: నాకు మంచి ఊపొచ్చింది.. ఈ జోరును కొనసాగిస్తాం!
- ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ బోణీ
- గుజరాత్ టైటాన్స్పై 11 పరుగుల తేడాతో విజయం
- మొదటి బంతికే ఫోర్ బాదడం ఊపొచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీజన్ తొలి మ్యాచులోనే 97 పరుగులతో నాటౌట్గా నిలవడం తమకు మరింత కలిసొచ్చే అంశం అని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. శశాంక్ సింగ్ అద్భుతంగా ఆడాడని, 16 బంతుల్లో 44 రన్స్ చేయడం జట్టుకు కీలకంగా మారాయన్నాడు. ఒత్తిడిలో కూడా విజయ్ కుమార్ వైశాక్ ప్రశాంతంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. సీజన్ ప్రారంభానికి ముందే అన్ని విధాలుగా సిద్ధమయ్యామని, ఇదే జోరును మిగతా మ్యాచ్ల్లోనూ కొనసాగించాలనుకుంటున్నాం అని శ్రేయస్ చెప్పాడు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచులో 11 పరుగుల తేడాతో గెలిచింది.
మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ… ‘సీజన్ తొలి మ్యాచ్లో 97 పరుగులతో నాటౌట్గా నిలవడం మాకు కలిసొచ్చే అంశం. నేను ఎదుర్కొన్న మొదటి బంతికే ఫోర్ బాదడం మంచి ఊపొచ్చింది. కాగిసో రబాడ బౌలింగ్లో ఫ్లిక్ సిక్స్ కూడా చాలా ప్రత్యేకం. శశాంక్ సింగ్ 16 బంతుల్లో 44 పరుగులు చేయడం జట్టుకు చాలా కీలకంగా మారింది. మేము దూకుడుగా ఆడేందుకు ఓ బెంచ్ మార్క్ సెట్ చేసుకున్నాం. మంచు కురుస్తున్న కొద్దీ పరిస్థితులు వేగంగా మారతాయి. అయినా వైశాక్ అద్భుతంగా రాణించాడు. రాగానే యార్కర్లు వేశాడు. ఒత్తిడిలో కూడా చాలా ప్రశాంతంగా బౌలింగ్ చేశాడు’ అని ప్రశంసించాడు.
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
Also Read: 2032 Olympics: 2032 ఒలింపిక్స్ తర్వాత ప్రతిష్టాత్మక క్రికెట్ స్టేడియం కూల్చివేత!
‘వైడ్ యార్కర్ ప్రణాళికలో అర్ష్దీప్ సింగ్ ముఖ్య పాత్ర పోషించాడు. బంతి కొంచెం రివర్స్ అవుతుందని అర్ష్దీప్ చెప్పాడు. దాంతో బంతిపై లాలాజలం పూయడంతో బౌలర్లకు కొంత సహాయపడుతుందని నేను భావించాను. సాయిని అర్ష్దీప్ ఔట్ చేయడంతో మ్యాచ్ టర్న్ అయింది. వైడ్ యార్కర్లను లేట్ చేయకుండా ముందుగానే ప్రారంభిద్దాం అని చెప్పాడు. సీజన్ ప్రారంభానికి ముందు మేము అన్ని విధాలుగా సిద్దమయ్యాం. మా సమావేశాలలో మైదానంలో మనం ఏమి చేయగలమో దాని గురించి చర్చించాం. ఇదే ఊపును మిగతా మ్యాచ్ల్లోనూ కొనసాగించాలనుకుంటున్నాం’ అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
తాజావార్తలు
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!