MS Dhoni: కొత్తలో ఆ రూల్ నచ్చలేదు.. ఇప్పటికీ నాకు అవసరం లేదు!
- ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అవసరం లేదనిపించింది
- ఇంపాక్ట్ రూల్ నాకు అవసరం లేదు
- ఆటలో పాలుపంచుకోవడమీ నాకు ఇష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన కొత్తలో తనకు అస్సలు నచ్చలేదని, అవసరం లేదనిపించిందని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపారు. ఆటలో పాలుపంచుకోవడం తనకు ఇష్టం అని, ఇప్పటికీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు అవసరం లేదన్నారు. ఇంపాక్ట్ రూల్ వల్ల మ్యాచ్ల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయని చాలా మంది అనడంలో నిజం లేదని, ఆటగాళ్ల మైండ్ సెట్ మారడంతోనే పెద్ద స్కోర్స్ సాధ్యమవుతున్నాయని ధోనీ చెప్పుకొచ్చారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని ఐపీఎల్ 2023లో ప్రవేశపెట్టారు. ఈ రూల్ వల్ల అదనంగా ఒక బ్యాటర్ లేదా బౌలర్ను ఆడించే అవకాశం ఉంటుంది.
‘జియోస్టార్’తో ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ… ‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను అమలు చేసిన కొత్తలో అవసరం లేదని నేను భావించాను. ఒక విధంగా ఈ రూల్ నాకు సహాయపడుతుంది. కానీ నాకు దాని అవసరం లేదు. నేను ఇప్పటికీ కీపింగ్ చేస్తాను కాబట్టి నేను ఇంపాక్ట్ ప్లేయర్ని కాదు. ఆటలో పాలుపంచుకోవడమీ నాకు ఇష్టం. ఇంపాక్ట్ రూల్ వల్ల భారీ స్కోర్లు నమోదవుతున్నాయని చాలా మంది అంటున్నారు. పిచ్ పరిస్థితులు,ప్లేయర్ల కాన్ఫిడెన్స్ కారణంగానే భారీ స్కోర్లు నమోదవుతున్నాయని నేను నమ్ముతున్నా. అదనపు బ్యాటర్ ఉన్నాడనే ధైర్యంతో ప్లేయర్స్ భయం లేకుండా, దూకుడుగా ఆడుతున్నారు. ఈ రూల్ ముందుగా వచ్చే ప్లేయర్ల ఆట తీరును మార్చేస్తోంది’ అని అన్నారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Also Read: KL Rahul: కేఎల్ రాహుల్కు ప్రత్యేక విషెష్ చెప్పిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2025లో ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. 43 ఏళ్ల వయసులోనూ కీపర్గా అదరగొడుతున్నారు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ను మెరుపు స్టంపింగ్ చేసి.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. యువ కీపర్ రిషబ్ పంత్ కూడా మహీ అంత వేగంగా క్రీజులో కదలలేకపోతున్నాడు. అంతేకాదు పంత్ తప్పిదం కారణంగా లక్నో మ్యాచ్ కూడా ఓడింది. దాంతో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇక చెన్నై తర్వాతి మ్యాచ్లో మార్చి 27న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!