KKR vs RCB : కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్.. ఆర్సీబీ ఘన విజయం
- కోల్కతాపై బెంగళూరు విజయం
- 7 వికెట్ల తేడాతో బెంగళూరు గెలుపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KKR vs RCB : ఐపీఎల్ 2025లో ఈరోజు కోల్కతాలో జరిగిన తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమీతుమీగా తలపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్ జరగుతుందా లేదా అనే అనుమానాలు మొదట ఉత్కంఠ రేపాయి. అయితే, వరుణుడు సహకరించడంతో ఆట సజావుగా సాగింది. టాస్ గెలిచిన ఆర్సీబీ, మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ ఆదిలోనే కష్టాల్లో పడింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (4) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. హేజిల్వుడ్ వేసిన ఐదో బంతికి వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అప్పటికే ఒత్తిడిలో ఉన్న కోల్కతా జట్టును కెప్టెన్ అజింక్య రహానే, సునీల్ నరైన్ కలిసి ముందుకు నడిపించారు. తొలి మూడు ఓవర్లలో కేవలం 9 పరుగులు చేసిన కేకేఆర్, ఆ తర్వాత ఆరు ఓవర్లలో ఏకంగా 90 పరుగులు జత చేసింది. రహానే 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, తమ జట్టును మిడిలార్డర్ వరకు చక్కగా నడిపించాడు. పది ఓవర్లు ముగిసే సమయానికి కేకేఆర్ 100 పరుగుల మార్కును దాటింది.
Also Read
- Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
- Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
అయితే, భారీ స్కోర్ దిశగా సాగుతున్న కేకేఆర్పై ఆర్సీబీ బౌలర్లు తిరుగు దాడి చేశారు. వరుసగా కీలక వికెట్లను కోల్పోవడంతో కోల్కతా జట్టు స్వల్ప వ్యవధిలోనే కోలుకోలేని దశకు చేరుకుంది. మిడిలార్డర్ ఆటగాళ్లు రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్ కూడా ఆశించిన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. దీంతో, 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేకేఆర్ 174 పరుగులకే పరిమితమైంది.
175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. క్రీజ్లోకి ఎంట్రీ అయిన విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ కోల్కతా బౌలర్లకు చుక్కలు చూపించారు. వికెట్ కోల్పోకుండా నిలకడగా ఆడిన ఈ జోడీ, కేకేఆర్ బౌలర్లపై ఎదురుదాడి చేసింది. సాల్ట్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, కోహ్లీ కూడా అర్ధ శతకంతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ బౌలింగ్ విభాగం కట్టుదిట్టమైన ప్రదర్శన కనబర్చే ప్రయత్నం చేసినప్పటికీ, విరాట్, సాల్ట్ జోడీ వారి అంచనాలను తలకిందులు చేసింది. పటిష్ఠమైన స్ట్రోక్ ప్లే ద్వారా ఆర్సీబీ విజయం దిశగా సాగింది. చివరకు, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించి, తమ సీజన్ను ఘనంగా ఆరంభించింది.
Pooja Hegde : సినిమాల్లో హీరోయిన్లపై వివక్ష ఉంది.. పూజాహెగ్దే సంచలన కామెంట్స్
తాజావార్తలు
-
JanaNayagan : జననాయగన్ ఓటీటీ రైట్స్ అమెజాన్ రీ-ఎంట్రీ?
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
RJ Balaji: చరణ్తో సినిమా చేయాలని ఉంది.. దర్శకుడు ఆర్ జె బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు !
-
Tollywood : సమ్మర్ అంటే భయపడిపోతున్న స్టార్స్
-
CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?